Home » delhi liquor scam case
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయవద్దని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. విచారించిన న్యాయస్థానం ఆయన పిటిషన్ని తోసిపుచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ బలవంతపు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలవంతపు చర్య (అరెస్ట్)లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరారు.
MLC Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) చిక్కులు తప్పేలా లేవు. సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కవితకు చుక్కెదరయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి..
Supreme Court Verdict On Kavitha Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) పిటిషన్పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరుగుతోంది. ఇదివరకే తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్ను కోర్టు నుంచి కవిత లాయర్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు జారీ చేసిన సమన్లు అక్రమమని ఆయన పేర్కొన్నారు. ఆమాద్మీ పార్టీ సైతం ఈడీ నోటీసులు చట్టవిరుద్దమని ప్రకటించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్రేజీవాల్ను టార్గెట్ చేసి వేధిస్తోందని, దీనికోసం ఈడీని ఉపయోగించుకుంటోందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ జలబోర్డులో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ఈరోజు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఈడీ అధికారులు మరోసార్లు సమన్లు జారీచేశారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలచంలో విచారణకు రావాలని అధికారులు సమన్లలో పేర్కొన్నారు.
Kavitha Custody Report: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) వరుస షాక్లు తగులుతున్నాయి. 7 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఈడీ ఇక రంగంలోకి దిగనుంది. కవిత కస్టడీకి సంబంధించి సంచలన విషయాలను ఈడీ రిలీజ్ చేసింది.
BRS MLC Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది...
కవిత అరెస్ట్పై పార్టీ నేతలకు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ నేతలతో గత రాత్రి కిషన్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా.. కవిత అరెస్ట్ విషయంలో తొందరపడి మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆయన ఆదేశించారు.
KTR Remembers Chandrababu: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ అరెస్టుపైనే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే జరుగుతోంది. ఇదంతా అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్.. అబ్బే మాకేం సంబంధం లేదని బీజేపీ చెప్పుకుంటున్నాయ్.