• Home » Delhi Excise Policy

Delhi Excise Policy

Arvind Kejriwal: రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..

Arvind Kejriwal: రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam case) సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) ఎట్టకేలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కాగా కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల వ్యక్తిగత బాండ్, రూ.1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు.

Kavitha: నన్ను అరెస్టు చేస్తారు.. గతంలోనే చెప్పేసిన కవిత..

Kavitha: నన్ను అరెస్టు చేస్తారు.. గతంలోనే చెప్పేసిన కవిత..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారాయి. అయితే ఈడీ అధికారులు తనను అరెస్టు చేస్తారని, తన అరెస్టు తప్పదని గతంలోనే కవిత చెప్పారు.

Kavitha: కవిత అరెస్టుపై ఈడీ కీలక ప్రకటన.. ఆ యాక్ట్ కిందే చర్యలు తీసుకున్నామని వెల్లడి..

Kavitha: కవిత అరెస్టుపై ఈడీ కీలక ప్రకటన.. ఆ యాక్ట్ కిందే చర్యలు తీసుకున్నామని వెల్లడి..

దిల్లీ మద్యం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం నుంచి సుదీర్ఘ సోదాల అనంతరం ఈడీ అధికారులు కవితను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.

KTR: చెల్లి కోసం అన్న పోరాటం.. అలా ఎలా అరెస్టు చేస్తారంటూ కేటీఆర్ ఫైర్..

KTR: చెల్లి కోసం అన్న పోరాటం.. అలా ఎలా అరెస్టు చేస్తారంటూ కేటీఆర్ ఫైర్..

దిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( kavitha ) ను ఈడీ అరెస్టు చేసింది. కవిత అరెస్టుతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి.

Delhi: వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాల్సిందే.. కేజ్రీవాల్‌కు తేల్చిచెప్పిన న్యాయస్థానం

Delhi: వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాల్సిందే.. కేజ్రీవాల్‌కు తేల్చిచెప్పిన న్యాయస్థానం

లిక్కర్ పాలసీలో విచారణకు సంబంధించి ఆఫ్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల మధ్య దోబూచులాట కంటిన్యూ అవుతూనే ఉంది. విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీచేస్తూనే ఉంది. అసెంబ్లీ అని ఉందని, వ్యక్తిగత కారణాలు చూపుతూ కేజ్రీవాల్ మినహాయింపు కోరుతున్నారు. తాజాగా మరోసారి ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.

Delhi Excise policy case: పట్టువీడని ఈడీ... సీఎంకు ఎనిమిదో సారి సమన్లు

Delhi Excise policy case: పట్టువీడని ఈడీ... సీఎంకు ఎనిమిదో సారి సమన్లు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారంనాడు మరోసారి సమన్లు పంపింది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని కోరింది. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపడం ఇది వరుసగా ఎనిమిదో సారి.

MLC Kavitha: సీబీఐకి లేఖ రాసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kavitha: సీబీఐకి లేఖ రాసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

Arvind Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా.. ఇప్పటివరకు ఎన్నిసార్లంటే..

Arvind Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా.. ఇప్పటివరకు ఎన్నిసార్లంటే..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారకు డుమ్మా కొట్టారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈ నెల 14న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం విచారణ

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం విచారణ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు విచారించనుంది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ విచారణకు హాజరవడం లేదని ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 5 సార్లు సమన్లు ఇచ్చినా లెక్క చేయలేదని పేర్కొన్నారు. ఆ కేసులో ఈ రోజు కేజ్రీవాల్ కోర్టుకు రావాల్సి ఉంది. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్ తరఫు లాయర్లు కోర్టును కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.

Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం

Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా పావులు కదిపారు. ఢిల్లీ అసెంబ్లీలో శుక్రవారంనాడు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం శనివారంనాడు సభలో చర్చకు చేపట్టనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి