Home » Delhi Excise Policy
దిల్లీ మద్యం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) జారీ చేసిన ఆర్డర్స్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న ఈడీ.. కాగితాలు, కంప్యూటర్ ను తాము సమకూర్చలేదని, అవి ఆయనకు ఎలా వచ్చాయో చెప్పాలంటూ మంత్రి అతిశీని ప్రశ్నించింది.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Kejriwal ) సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టడి నుంచి తొలి ఆర్డర్స్ సైతం జారీ చేసేశారు.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది. హోలీ సందర్భంగా విచారణకు విరామం ఇస్తారని.. ఒకవేళ విచారించినా గంటో, రెండు గంటలో ప్రశ్నిస్తారని కవితతోపాటు
దేశవ్యాప్తంగా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్న తరుణంలో ఆప్ నేత అతిశీ కీలక ప్రకటన చేశారు. దిల్లీ మద్యం కేసులో తమ నాయకుడు కేజ్రీవాల్ ( Kejriwal ) ను అన్యాయంగా ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ కారణంగా తాము హోలీ ఆడలేకపోతున్నట్లు తెలిపారు.
మద్యం కుంభకోణంలో కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జలవనరుల శాఖకు జారీ చేశారు. ఇవాళ సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అతిషి సీఎం ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు.
దిల్లీ మద్యం కేసులో ఇటీవల అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ పై బీజేపీ మండిపడింది. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ( Kejriwal ) పడుతున్న బాధకు కేజ్రీవాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీకేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను జైలుకు పంపినా అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని చెబుతూ వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆ దిశగా పావులు కదుపుతోంది. జైలులో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ కోర్టుకు వెళ్తామని ఆ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ శనివారంనాడు తెలిపారు.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. అరెస్టు అయినప్పటికీ దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగడం నీచమైన రాజకీయం అని ఫైర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్కు సపోర్ట్ గా నిలిచినందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు.
లిక్కర్ స్కామ్లో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈడీ విధించిన రిమాండ్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. రిమాండ్ పిటిషన్ను ఆదివారం లోపు విచారించాలని కోరారు. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో పైర్ అయ్యారు. కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు స్వాగతిస్తున్నానన్నారు. తాను అప్రూవర్ గా మారి సీఎంకు శిక్ష పడేలా చేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.