Home » Damodara Rajanarasimha
సుల్తాన్పూర్లోని ఆందోల్ గ్రామంలో ఫార్మసీ పీజీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది.
తెలంగాణ రాష్ట్ర అవయవ దానం బిల్లు-2025కు అసెంబ్లీ గురువారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2011లో కొన్ని సవరణలతో సమగ్రంగా రూపొందించిన చట్టాన్నే రాష్ట్రంలో కూడా అమలు చేయాలని నిర్ణయించి, దానికి అనుగుణంగా ఈ బిల్లుకు రూపకల్పన చేశారు.
ప్రైవేటు పాఠశాలల ఫీజు నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిషన్ను త్వరలో ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, కొత్త పాఠశాలలు ప్రారంభించడం కంటే ప్రస్తుతవాటిని మెరుగుపరచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు
Minister Damodar Raja Narasimha: ఎడ్యుకేషన్ కమిషన్ సూచనల మేరకు విద్యా వ్యవస్థను బాగుచేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. స్కూల్లో ఉన్న పిల్లల గురించి ఇంటిదగ్గర ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితులు ఉండకూడదని చెప్పారు.
మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ను నివారించేందుకు వాడే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) టీకాలు అందించే విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
అన్ని రంగాల్లో మహిళలు కీలకపాత్ర పోషించి, సమాజ గుణాత్మక పురోగాభివృద్థికి కృషి చేస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం ఆయన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏక సభ్య కమిషన్ అద్భుతమైన నివేదిక ఇచ్చిందని, అందులో వంకలు పెట్టడానికి ఏమీ లేదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
నిలోఫర్ ఆస్పత్రిలో రక్తం బ్యాగుల దొంగతనం వ్యవహారంపై సర్కార్ సీరియస్ అయింది. అక్కడి సిబ్బంది రక్తం బ్యాగులను దొంగలించి బయటకు అమ్ముకుంటున్నారని ‘బ్లడ్ బ్యాంకుల్లో దొంగల’ పేరిట ఈనెల 22న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురితమైంది.
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్యులకు పదోన్నతులు కల్పించాలని, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ను సెకండరీ గ్రేడ్ హెల్త్ సర్వీసె్సగా మార్చాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం కోరింది.
ఎస్సీ వర్గీకరణ ఏ ఒక్క కులానికి, మతానికి వ్యతిరేకం కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రిజర్వేషన్ల కేటాయింపు 2011 జనాభా లెక్కల ప్రకారం చేశామని, ఎస్సీ రిజర్వేషన్లపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు.