Home » Cyber attack
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలకు అడ్డే లేకుండా పోతోంది. మీ పేరున ఉన్న మొబైల్ నంబర్ నుంచి ఓ మహిళకు నగ్న చిత్రాలు, బూతు సందేశాలు వస్తున్నాయి.. దీనికి సంబంధించి బెంగళూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది’ అంటూ ఏకంగా రూ.8.50 లక్షలు కొల్లగొట్టారు. ఇది కేవలం వెలుగులోకి వచ్చిన విషయం మాత్రమే. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
బ్రాండెడ్ పేరుతో నకిలీ ఆయిల్ అంటకడుతున్న వారి ఆట కట్టించారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. గత కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. ప్రజల్లో కొంత అవగాహన లేమీతో ఈ తరహ మోసాలకు అంతే లేకుండా పోతోంది. అలాంటి మోసమే తాజాగా నగరంలో వెలుగుచూసింది.
నగరంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడొ ఓ చోట ఈ సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వర్క్ఫ్రం హోం జాబ్ పేరిట రూ.5.67 లక్షలు కొల్లగొట్టారు. ప్రతిరోజూ ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఈ సైబర్ మోసాలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా సికింద్రాబాద్ కు చెందిన వ్యాపారి ఒకరు సైబర్ మోసానికి బలయ్యారు.
ఎవరో తెలియదు.. ఎక్కడుంటారో తెలియదు.. కానీ రోజూ లక్షల రూపాయలను కొల్లగొట్టేస్తున్నారు ఈ సైబర్ కేటుగాళ్లు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా ఒక్క ఫోన్కాల్తో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. తాజాగా నగరానికి చెందిన ఓ మహిళ సైబర్ మోసానికి బలైపోయి రూ.2.19లక్షలు పోగోట్టుకుంది.
మొన్న 11.25 లక్షలు, నిన్న 8.20 లక్షలు, నేడు రూ. 1.90 లక్షలు... ఇలా నగరంలో ఎవరో ఒకరు సైబర్ మోసాలకు బలైపోతూనే ఉన్నారు. ఎవరో చదువురాని వాళ్లంటే ఏమో అనుకోవచ్చుగాని, విద్యావేత్తలు, చివరకు ఉద్యోగస్తులు కూడా సైబర్ మోసాలకు బలైపోతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కొత్తవారు పంపిన లింక్లను ఓపెన్ చేయొద్దని, సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ సూచించింది. నగరంలో ఇటీవల సైబర్ నేరాలు అధికమయ్యాయి. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుంబిగించింది.
సైబర్ నేరగాళ్లు ఓ రిటైర్డ్ ఉద్యోగినిని నిండా ముంచేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.23 లక్షలు కొల్లగొట్టారు. దీంతో ఆ రిటైర్డ్ ఉద్యోగిని లబోదిబోమంటున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఎవరో అనామకుడు బలయ్యాడనుకుంటే ఏమో అనుకోవచ్చు గాని ఏకంగా విద్యావంతలు, ఉద్యోగులే బలవుతుండడం ఇక్కడ గమనించదగ్గ విషయం.
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రతిరోజూ ఎక్కడో ఇకచోట ఈ మోసాలు జరుతుగూనే ఉన్నాయి. పోలీస్ శాఖ ఈ తరహ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పస్తున్నటికీ.. సైబర్ మోసగాళ్లు మాత్రం కొత్తదారులు వెతుకుతూ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.
ఫేస్బుక్ ప్రొఫైల్(Facebook profile)లో ఉన్న ఫొటోను దుర్వినియోగం చేసి నగరానికి చెందిన వ్యాపారవేత్తను సైబర్ క్రిమినల్స్(Cyber criminals) బురిడీ కొట్టించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు మీ సోదరుడి కొడుకును సిడ్నీ ఎయిర్పోర్టులో ఆపేశామంటూ స్పాట్ వీసా పేరుతో రూ.1.60లక్షలు కొల్లగొట్టారు.