Home » Crime
32 వేల జీతం అందుకునే కాఫీషాప్ వర్కర్ పురుషోత్తం వరుణ్ కుమార్ ఐదేళ్లలో రూ.459 కోట్లకు పైగా అక్రమ సంపాదన చేశాడు. మద్యం మాఫియాలో ఉన్న పెద్దవారితో కలిసి చెత్త బ్రాండ్ల అమ్మకాలను నడిపించి, ప్రభుత్వం మారగానే పారిపోయాడు.
Delhi Serial Killer Arrested: 100 మందిని అతిక్రూరంగా చంపి హింస మహాపాపమంటూ ప్రచారం చేస్తున్నాడు ఓ హంతకుడు. రెండేళ్లుగా పరారీలో ఉన్న ఆ సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు సినీఫక్కీలో పోలీసుల చేతికి చిక్కాడు. 'డాక్టర్ డెత్' గా పేరుగాంచిన..
సూర్యాపేటలో ఒక మహిళకు అనుమతుల్లేని ఆస్పత్రిలో అబార్షన్ చేయించడంతో తీవ్ర రక్తస్రావం సంభవించి ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యులు వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ధనుంజయ్ రెడ్డి సంబంధిత మహిళ దుబాయ్ నుంచి బంగారం తరలించిన విషయాన్ని కూడా సిట్ దర్యాప్తు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మద్యం స్కాం వెనుక అసలైన సూత్రధారిని బయటకు తేయాలని టీడీపీ ఒత్తిడి తెస్తోంది.
తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా కొత్త మార్గాలు, హైటెక్పద్ధతులతో జరుగుతోంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి ఎస్కార్ట్ వాహనాలు, మొబైల్ యాప్ల సహాయంతో ఇసుక దొంగతనం కొనసాగుతోంది.
నెల్లూరు జిల్లా ఆమంచర్లలో బంధువు ఏడాదిగా 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతిగా తేలడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడు.
Karnataka Crime News: డిగ్రీ చదివే ఓ యువకుడు చేసిన మర్డర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎవరికీ తెలియకూడదని హత్య చేసి చివరికి ఇలా అడ్డంగా బుక్కవడం చూసి కుటుంబ సభ్యులే షాక్ అయ్యారు. అమాయకంగా కనిపించే కుర్రాడి మనసులోకి ఇంత పగ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు.
లంచం కేసులో అరెస్టైన డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో అక్రమంగా మందుగుండు వస్తువులు వెలుగుచూశాయి. 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్లపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 నోటిఫికేషన్లో అక్రమాలపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కామ్సైన్ కంపెనీ ద్వారా డిజిటల్ మూల్యాంకనం జరిపి అక్రమంగా 1.14 కోట్లు తీసుకున్న ఆఫీసర్లపై విచారణ జరుగుతోంది.
కృష్ణ జిల్లా: కృత్తివెన్ను మండలం, మాట్లం గ్రామంలో దారుణం జరిగింది. వృద్ధులని చూడకుండా భార్యా భర్తలను.. నాగరాజు, చింతా వెంకట లక్ష్మి, వారి పిల్లలు వచ్చి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.