Home » Crime
రాజధాని హైదరాబాద్ మహానగరంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చందానగర్లోని ఖజానా జువెలరీలో భీభత్సం సృష్టించారు.
రాతియుగాన్ని తలపించేలా కొందరు కలిసి దళిత యువకుడైన పవన్పై విచక్షణారహితంగా దాడి చేయడం దురదృష్టకరమని ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎ్స.జవహర్ అన్నారు.
కన్నప్రేమను మర్చిపోయి..మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది ఓ మహిళ. అకారణంగా కొడుకు తలపై బండరాయితో దారుణంగా కొట్టి హింసించింది. తీవ్రగాయాలైన బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
‘ఉచితం’ మాటున నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వేస్తున్నారు. పగలంతా ఒక ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. రాత్రిళ్లు రాష్ట్ర సరిహద్దులు దాటించి తమిళనాడుకు తీసుకెళుతున్నారు. ఇలా రాత్రింబవళ్లు ఇసుక దందా సాగిస్తున్నా అధికారులు కిమ్మనడంలేదు.
చీకటి పడితే చాలు.. ఆ వెంటనే ఎక్స్కవేటర్ల రొద మొదలవుతుంది. ప్రభుత్వ భూమిని చీల్చి గ్రావెల్ను తవ్వుతాయి. టిప్పర్లు రయ్మంటూ పరుగులు తీస్తాయి. ఇలా పూలతోటమిట్టలో మొదలయ్యే గ్రావెల్ అక్రమ రవాణా సూళ్లూరుపేట, తడ ప్రాంతాలకు సాగుతోంది.
సృష్టి కేసు వ్యవహారంలో ఏ1 నిందితురాలు డాక్టర్ నమ్రతను రెండవ రోజు కస్టడీలో భాగంగా పోలీసులు విచారించనున్నారు. మొదటి రోజున విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన డాక్టర్ నమ్రత నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
సృష్టి ఫెర్టిలిటీ కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. సరోగసీ పేరుతో పలువురు దంపతులను మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టు లో పేర్కొన్నారు.
బిహార్లో హోం గార్డ్ రిక్రూట్మెంట్కు హాజరైన 26 ఏళ్ల మహిళ స్పృహతప్పిపోవడం, అంబులెన్స్లోనే ఆమెపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా, పరదాల మాటున బండరాళ్లు తరలిపోతున్నాయి.
తవణంపల్లె మాజీ వైస్ ఎంపీపీ, టీడీపీ నాయకుడు తెల్లగుండ్లపల్లె రంగయ్యనాయుడు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.