Home » CPI Narayana
యుద్ధం కాకుండా ఉగ్రవాద నిర్మూలనదే సరైన దారి అని సీపీఐ నారాయణ అన్నారు. రెండు దేశాలు శాంతియుతంగా వ్యవహరించాలన్నారు
టెర్రరిజాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని.. నక్సలిజం అంతంపై పెట్టిన దృష్టిలో పదో శాతం టెర్రరిజంపై పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చనిపోయిన మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలని, టెర్రరిజంపై వ్యతిరేకంగా ఉన్న వారిని ఐక్యం చేయాలని సూచించారు.
ప్రధాని మోదీ అమరావతి అభివృద్ధి కోసం నిధులు ప్రకటించకపోవడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తప్పుపట్టారు. ప్రత్యేక హోదా మరియు అభివృద్ధి పనుల మంజూరుపై సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని మోదీ వద్ద చొరవ చూపాలని సూచించారు. గత ఐదేళ్లుగా అమరావతి అభివృద్ధిని విస్మరించినట్లు ఆయన వ్యాఖ్యానించారు
రాష్ట్రాల గవర్నర్లందరూ ఆర్ఎస్ఎస్కి చెందినవారని, ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ విమర్శించారు. గోశాల అంశాన్ని ఇక ముగించాలని, రాజధాని నిర్మాణానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది
వక్ఫ్ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధమని CPI జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. మత ప్రాతిపదికన భూసేకరణ అనేదే అసంగతమని ఆయన విమర్శించారు
యువతను నాశనం చేసే బెట్టింగ్ యాప్లు, సమాజాన్ని చెడగొట్టే వాణిజ్య ప్రకటనలను సినీనటులు ప్రోత్సహించవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సూచించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిష్కళంకమైన పాలన, అత్యున్నత మానవతావాది అయిన మన్మోహన్ సింగ్ ఆధునిక భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరని కొనియాడారు.
Telangana: తెలుగు చిత్ర పరిశ్రమై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నిర్మాతలు వందల కోట్లతో చిత్రాలు నిర్మించి, అధికంగా వసూలు చేసే నిమిత్తం ప్రేక్షకులపై భారం వేస్తున్నారని తెలిపారు. ఆ క్రమంలో బ్లాకులో టికెట్లు అమ్మేందుకు ప్రయత్నిస్తూ..
సినిమాకు పెట్టుబడి ఎక్కువయిందని కోట్లకు పడగ లెత్తే ఆసాముల మోరను ఆలకిస్తారా.. పుష్పా సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలసి థియేటర్లో కూర్చిని చూడగలమా.. ‘లేస్తే ఒకసారి , కూరుచుంటి ఒకసారి ’ అనే చీపు సంభాషణలు ఏ కళకు నిదర్శనమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు.