Home » Corona Virus
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు నమోదుకాగా.. ముగ్గురు మృతి చెందారు. కాగా కోవిడ్ యక్టీవ్ కేసుల సంఖ్య 4,394కు పెరిగింది. అయితే ఇవి గత 228 రోజుల్లోనే అత్యధిక కేసులు కావడం విశేషం.
బాపట్ల జిల్లా: కొరిశపాడులో కరోనా కలకలం రేపింది. గత వారం కొరిశపాడు గ్రామం నుంచి శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. వారితో పాటు మరో 30 మంది గ్రామస్తులు ఒకే బస్సులో ప్రయాణించారు.
దేశంలో కోవిడ్ ప్రభావం నాలుగేళ్లు దాటినా కూడా ఇంకా తగ్గడం లేదు. పలు రకాల వేరియంట్ల రూపంలో వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలో తాజాగా దేశంలో 227 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు భారత్లో 4170 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా కరోనా ( Corona ) మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నిన్న మొన్నటిదాకా కేసులు పెద్దగా నమోదవ్వని తరుణంలో.. కరోనా వైరస్ నుంచి దాదాపు విముక్తి లభించిందని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే ఈ వైరస్ మరోసారి కోరలు చాచడం మొదలుపెట్టింది. గతకొన్ని రోజుల నుంచి మన భారతదేశంలో...
దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.
అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక సూచన చేసింది. కరోనాపై తమ నిఘాను పటిష్టం చేయాలని ఆగ్నేసియా దేశాలను కోరింది. కోవిడ్ 19 కారణంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
కరోనా మహమ్మారి (Corona) మరోసారి విజృంభిస్తోంది. గురువారం హైదరాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రి ‘నీలోఫర్’లో 14 నెలల శిశు బాలుడికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. అయితే బాలుడి బాలుడి ఆరోగ్యం స్థిరంగానే ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషా రాణి వెల్లడించారు.
హైదరాబాద్: చిన్న పిల్లల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్తో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని కేంద్రప్రభుత్వం సూచించింది. హైదరాబాద్లో పిల్లల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.