Home » Congress
డిసెంబర్ ఎన్నికల్లో కొన్ని మున్సిపల్ కౌన్సిల్స్లో ఏ పార్టీకి మెజారిటీ రాని 'హంగ్' పరిస్థితి తలెత్తింది. దీంతో అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ మేయర్ పదవి కోసం బీజేపీ నేతలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు.
రాజశేఖర్ అంతిమ సంస్కారాలపై పలు అనుమానాలున్నాయని మాజీమంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ మృతదేహాన్ని పూడ్చే సంప్రదాయం ఉన్నా.. కాల్చారని ఆయన అన్నారు.
భారత్ ఎగుమతులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిందని, ఇది భారతీయ వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని చవాన్ అన్నారు. 50 శాతం సుంకంతో వ్యాపారం చేయడం సాధ్యం కాదన్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి 32 సీట్లు కేటాయించేందుకు డీఎంకే నుంచి ప్రతిపాదన వచ్చింది. అయితే 40 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కనీసం 38 సీట్లయినా ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు బేరం పెట్టినట్టు చెబుతున్నారు.
కేంద్ర మాజీ మంత్రి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సురేశ్ కల్మాడి (81) కన్నుమూశారు. పీవీ నరసింహారావు కేబినెట్లో రైల్వే మంత్రిగా, ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.
అస్సామ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో విజయంపై కన్నేసిన హస్తం పార్టీ.. ఆ ప్రణాళికల్లో భాగంగా స్క్రీనింగ్ బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించింది.
తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతున్న సమయంలో పలువురు ఎమ్మెల్యేలు సభలో ఉండకుండా లాబీల్లో తిరగడంపై సీఎం రేవంత్ సీరియస్గా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం నాడు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. జిల్లాలు, ముఖ్య పట్టణాలకు కలిపి 41 మంది అధ్యక్షుల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది.
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదని శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీపడబోమని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ నేతలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షుడు బీఎస్ విజయేంద్ర ధ్వజమెత్తారు. గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా.. బళ్లారిలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీసింది.