Home » Congress 6 Gurantees
తెలంగాణ ప్రజలు పదేళ్లపాటు దొరల పాలన చూశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం నాడు మెదక్లో జరిగిన జనజాతర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
బీఆర్ఎస్ (BRS) పార్టీ పని అయిపోయిందని.. .పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికలపై కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలపై కీలక అంశాలపై చర్చించారు.
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నీటి వనరుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. నల్గొండ దాహార్తిని , ఆపద కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టెయిల్ పాండ్ ఆధారాన్ని దొంగతనంగా ఖాళీ చేస్తే జిల్లా మంత్రులకు సోయిలేదని మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ ‘జన జాతర’ భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. రేవంత్ వేదికపైకి వచ్చే క్రమంలో పెద్ద పెట్టున నినాదాలతో సభ మార్మోగింది. సీతక్క ప్రసంగానికి రాగానే ఈలలు, కేకలతో సభ హోరెత్తింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫామ్ హౌస్ కేడీ తెలంగాణను దోపిడీ చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ ‘జన జాతర’ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దిగిపో దిగిపో అంటున్నావ్... ఉత్తగ వచ్చామా బిడ్డా అని కేసీఆర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.
20మంది కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు తెలంగాణ భవన్లో (Telangana Bhavan) బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు (BRS MP Candidates), ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో గజిని.. ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి (Maheshwar Reddy) ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు ఆయన ABNతో మాట్లాడుతూ... లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో రేవంత్కు రైతులపై కపట ప్రేమ కలిగిందన్నారు.
ఇండియా కూటమికి 272 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. రాహుల్ గాంధీ జూన్ 9వ తేదీన ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. సోమవారం నాడు జిల్లాలోని కోస్గిలో పర్యటించారు. ఈ సందర్భంగా నేతలకు లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట రామిరెడ్డి (Venkatarami Reddy) అన్నారు. ఆదివారం నాడు వర్గల్ మండలం గౌరారంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెంకటరామిరెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి , మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.