Home » Congress 6 Gurantees
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. హిందూ ధర్మం, మోదీపై అద్దంకి దయాకర్ అభ్యంతర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సీఈఓ వికాస్ రాజ్ను సోమవారం బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత (Madhavi latha) కలిసి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ (Congress) పార్టీ, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే.. బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మన దేశ ప్రజలు ఎలాంటి లబ్ధి పొందినా.. అది కేవలం రాజ్యాంగం వల్లే అని చెప్పారు. దేశంలో యాభై శాతం మంది అణగారిన వర్గాల వారు ఉన్నారని.. వారికి రాజ్యాంగం అండగా ఉందని తెలిపారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రాజ్యాంగం అనే పుస్తకాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ (BJP)కి 400 ఎంపీ సీట్లు వస్తే.. దేశానికి ప్రమాదమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. పెద్దపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమంటూ బాంబ్ పేల్చారు. హైదరాబాద్ను యూటీ చేయాలని కేటీఆర్ కలలు కంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీనే రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు.
దేశసంపదను అదానీ, అంబానీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దోచిపెడుతున్నారని.. వారికి ఎందుకు ఓటు వేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రశ్నించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట, పందిళ్లలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ , కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు , ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
బడేభాయ్.. చోటే భాయ్ కలిసి మోటార్లకు మీటర్లు పెడతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆయన చేపట్టిన బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్రంలో మరోసారి బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. రిజర్వేషన్లు ముట్టుకుంటే బీజేపీ నేతలు మాడిమసై పోతారని వార్నింగ్ ఇచ్చారు.
అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ (Congress) గద్దెనెక్కిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు (Harish Rao) అన్నారు. 10 ఏళ్లు కేంద్రంలో బీజేపీ ఉందని.. దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. పెట్రోల్ ధర, నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెంచిందని మండిపడ్డారు.
మాయమాటలు చెప్పటం తప్పా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దేశానికి ఏం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రశ్నించారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ (KCR) తనకు ఇచ్చిన వారసత్వం కరువని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సెటైర్లు గుప్పించారు. తాను అధిపత్యంపై యుద్ధం చేస్తున్నానని అన్నారు. శనివారం నాడు మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీళ్లు, కరెంట్ ఎక్కువగా ఇస్తున్నామని చెప్పారు.