Home » CM Siddaramaiah
‘ప్రస్తుత ప్రభుత్వంలోనే కాదు... మరో ఐదేళ్లు నేనే సీఎం’ అంటూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యారెంటీల అమలు కమిటీని రద్దు చేయాలని శాసనసభలో ప్రతిపక్షాలు బుధవారం ఆందోళన చేస్తున్న సందర్భంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో గ్రూపు విభేదాలతో పాటు నాయకత్వ మార్పు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా(Congress President) కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే చర్చలు సాగుతున్న తరుణంలోనే రాష్ట్ర ప్రజాపనుల శాఖా మంత్రి సతీశ్ జార్కిహొళి(Minister Satish Jarkiholi) రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు.
యూనివర్సిటీ(University)ల స్వయం ప్రతిపత్తి విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులో బుధవారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah)తోపాటు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(Telangana CM Revanth Reddy) పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తి కావడం, మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం కొనసాగుతున్న తరుణంలోనే మంత్రుల పనితీరుపై ఏఐసీసీకి నివేదిక సమర్పించడంతో దడ పట్టుకుంది.
సిద్దరామయ్య(Siddaramaiah) ఐదేళ్ల కాలం సీఎంగా కొనసాగుతారని, మధ్యలో మార్పు ఏమీ ఉండదని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్(Minister M.B. Patil) అన్నారు. శుక్రవారం హొస్పేట్ నగరంలో సిరసంగి లింగరాజ దేశాయ్ 164 జయంతి లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.
వయనాడ్లో వరదబాధితులకు వంద ఇళ్లను నిర్మిస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah) రాసిన లేఖకు కేరళ ముఖ్యమంత్రి తనదైన శైలిలోనే దీటుగా స్పందించారు. వయనాడ్ పునరావాసం సహాయానికి కేరళ స్పందించలేదని ఇటీవల సీఎం సిద్దరామయ్య రెండోలేఖను పంపిన విషయం తెలిసిందే.
అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమేనని డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా పౌర, ఆహార సరఫరాలశాఖ మంత్రి మునియప్ప(Minister Muniyappa) కీలక వ్యాఖ్యలు చేశారు
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ‘ముడా’ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంతోపాటు ఉప ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ ఓటమితో ఖంగు తిన్న తరుణంలోనే బలప్రదర్శనకు సిద్ధమయ్యారు.
వాల్మీకి కార్పొరేషన్(Valmiki Corporation)లో అవినీతి ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగేంద్ర(Nagendra)ను మళ్లీ కేబినెట్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నాగేంద్రకు సిద్దరామయ్య కేబినెట్లో బెర్త్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ప్రజాకోర్టులో గెలిచామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సంతోషం వ్యక్తం చేశారు. మూడు స్థానాల్లో మా అభ్యర్థులకు ప్రజలు ఆశీస్సులు అందించారని వారికి ధన్యవాదాలన్నారు. విజయానికి కార్యకర్తల కృషి, నాయకుల కష్టం ఉందన్నారు.