Home » CM Jagan
ఎన్నికల కమిషన్ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేసిందని హైకోర్టులో జగన్ ప్రభుత్వం లంచ్ మోషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసులో జగన్ ప్రభుత్వానికి (Jagan Govt) ఊరట దక్కలేదు. లంచ్ మోషన్ పిటీషన్పై మంగళవారం సాయంత్రం విచారణ జరిగింది.
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై మైలవరం కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. - మంగళవారం తోలుకొడు, వెదురు బీడెం, కనిమెర్ల, పోరాటనగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంపై విరుచుకుపడ్డారు. ‘‘తన అడుగులకు మడుగులోత్తలేదని.. టిక్కెట్ ఇస్తా... ఖర్చులు మొత్తం నేనే భరిస్తా..
ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గర పడుతుండటంతో పలువురి మద్దతు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి లభిస్తోంది. అన్నిమతాలు, కులాల వారి నుంచి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు (Nara Chandrababu Naidu) అపూర్వ ఆదరణ వస్తోంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పలు సంస్థలు టీడీపీతో కలిసి వస్తున్నాయి. ఇందులో భాగంగానే యూపీలోని దియోబంద్ నగరం కేంద్రంగా పని చేస్తున్న తన్జీమ్ ఈ ముఫ్తియాన్ (ముఫ్తీల జాతీయ సంస్థ) టీడీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది.
Andhrapradesh: ఏపీలో అనకాపల్లి, రాజమండ్రిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన అనంతరం ప్రజల నుంచి అశేషమైన స్పందన వచ్చిందని బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు అవినీతి, అక్రమ అరాచక పాలనలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వేలు రాజకీయ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏప్రియల్ 21 నుంచి మే5 మధ్యన నిర్వహించినట్లు పయోనీర్స్ పేరిట ఓ సర్వే చక్కర్లు కొడుతోంది. ఏప్రియల్ నెలలోనూ ఈ సంస్థ పేరిట ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సర్వేతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన సర్వేలో కొన్ని మార్పులు కనిపించాయి. ఏపీలో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు గెల్చుకుంటుందని ఈ సర్వే పేర్కొంది.
Andhrapradesh: వై నాట్ 175 సౌండ్ తగ్గింది.. వైసీపీకి భయం మొదలైంది అని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి సమాధి కట్టడానికి ప్రజలు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్నికల సక్రమంగా జరగవని జగన్ అంటుంటే తమకు ఆశ్చర్యంగా ఉంది.. ఎన్నికల్లో గొడవలు పెట్టి జగన్ ఈ విధంగా మాట్లాడటం ఏంటి అంటూ ఎద్దేవా చేశారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయనగరం జిల్లా గజపతినగరం(Gajapathinagaram) నియోజకవర్గ రాజకీయాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన గజపతినగరం అంటే సంచలనాలకు మారు పేరు. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి అన్ని వర్గాల వారిని ఇక్కడి ప్రజలు ఆదరించారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అత్యధికంగా 5 సార్లు గెలుపొందింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తెలుగు దేశం పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తోంది.
Andhrapradesh: చీఫ్ సెక్రటరీ ఎన్నికల విధుల్లో పని చేయకుండా జగన్ కొరకు పని చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులు బలవుతున్నారని మండిపడ్డారు. మచిలీపట్నంలో జగన్ కొత్త నినాదం ఎంచుకున్నారని.. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేలా నమ్మకం కనిపించడం లేదని అంటున్నారన్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డికి ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి మరోసారి లేఖ రాశారు. నవ సందేహాలు పేరులో షర్మిల ఇప్పటికే రెండు సార్లు సీఎంకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారంటూ మొదటి సారి, మద్యం నిషేధంపై రెండో సారి లేఖ రాసిన షర్మిల..
ఏపీలో అన్ని నియోజకవర్గాలకు ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప నుంచి మనుషులను పంపారని కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప (Chinarajappa) మండిపడ్డారు. పెద్దాపురం మండలం అనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.