• Home » CM Jagan

CM Jagan

AP Elections: ఇద్దరి నినాదం ఒకటే.. చేతులు కలిపిన కేసీఆర్, జగన్..

AP Elections: ఇద్దరి నినాదం ఒకటే.. చేతులు కలిపిన కేసీఆర్, జగన్..

ఎన్నికల వేళ ఎవరి నినాదాలు వారివి.. ఏపార్టీ వ్యూహాలు వారివి. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారివి.. కానీ ఆ రెండు పార్టీల విషయంలో మాత్రం అంతా రివర్స్ అనే ప్రచారం జరగుుతోంది. ఇద్దరి నినాదం ఒకటే.. ఇద్దరి వ్యూహాలు ఒకటే.. నీకోసం నేను.. నా కోసం నువ్వు అంటూ కలిసిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నీకు నేను, నాకు నువ్వు అనుకుంటూ అడుగులు వేస్తున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది.

AP Elections: స్టీల్‌ ప్లాంట్‌ కోసం మాట్లాడే హక్కు జగన్‌కు లేదు: పీతల మూర్తి యాదవ్

AP Elections: స్టీల్‌ ప్లాంట్‌ కోసం మాట్లాడే హక్కు జగన్‌కు లేదు: పీతల మూర్తి యాదవ్

Andhrapradesh: స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గాజువాకలో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్‌కు ఓటు వేస్తే... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని.. కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే... ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.

Pawan Kalyan: జగన్ వ్యక్తిగత సంపద మాత్రమే పెరిగింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan: జగన్ వ్యక్తిగత సంపద మాత్రమే పెరిగింది: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అప్పు తెచ్చి సంపదను తన వద్దే కేంద్రీకృతం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే సంపద సృష్టించొచ్చని అభిప్రాయపడ్డారు.

Kutami: తాను ఎప్పటికీ అలానే ఉంటాను: వెలగపూడి రామకృష్ణ బాబు

Kutami: తాను ఎప్పటికీ అలానే ఉంటాను: వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ: తూర్పు నియోజకవర్గం ప్రజలకు తాను ఎంతో చేశానని కూటమి అభ్యర్థి, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. తాను చేయగలిగినంత సహాయం చేస్తానని.. మాటలతో మోసం చేయడం తెలియదని అన్నారు. గతంలో ఎలా ఉన్నా.. రేపు కూడా అలానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

AP Elections: ఓటమిని ముందే ఒప్పుకున్న జగన్: వర్ల రామయ్య

AP Elections: ఓటమిని ముందే ఒప్పుకున్న జగన్: వర్ల రామయ్య

Andhrapradesh: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో ఇంకా అయోమయం నెలకొందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ ఇక్కడ అంటూ ఓటు వినియోగించుకోకుండా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్‌పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను ఉద్యోగులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దే అని తెలిపారు.

 AP Elections: జూన్ 4న సీఎం పదవికి  జగన్ రాజీనామా చేయడం ఖాయం: గంటా

AP Elections: జూన్ 4న సీఎం పదవికి జగన్ రాజీనామా చేయడం ఖాయం: గంటా

Andhrapradesh: భీమిలి నియోజకవర్గం మేనిఫెస్టోను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎట్టి పరిస్థితిలో మళ్లీ అధికారంలోకి రాకూడదని కూటమి పనిచేస్తుందన్నారు. వైసీపీ ఇంటికి పంపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. జూన్ 4న జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారని అన్నారు.

AP Elections: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తెచ్చింది బీజేపీనే: సీపీఎం శ్రీనివాసరావు

AP Elections: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తెచ్చింది బీజేపీనే: సీపీఎం శ్రీనివాసరావు

Andhrapradesh: ప్రధాని మోదీ విజయవాడ వస్తున్నాడంటే ప్రజలు ఎదురు చూడాలని.. కాని విజయవాడ వాసులు మోదీ వస్తున్నారంటే నిరాశక్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మీట్‌ దిప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ ఏపీ ప్రయోజనాల కోసం ఏం మాట్లాడలేదని.. దీంతో రాష్ట్ర ప్రజలంతా మోదీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారన్నారు.

ELECTIONS STORY : మేం నమ్మం జగన..!

ELECTIONS STORY : మేం నమ్మం జగన..!

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కసిగా మార్చుకొని ఓటుతో బుద్ధి చెప్పేందుకు జిల్లా ప్రజానీకం సమాయత్తమవుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాకు ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయానికి అన్ని వర్గాల ప్రజలు వచ్చారు. ‘మా నమ్మకం నువ్వే జగన’ నుంచి.. ‘నిన్ను నమ్మం జగన’ అనే పరిస్థితికి వచ్చారు. అడిగినందుకు ఒక్క చాన్స ఇచ్చామని.. ఐదేళ్లలో జిల్లాకు ఏం వెలగబెట్టారని ప్రశ్నిస్తున్నారు. పేరూరు, ..

AP Elections 2024: ఎన్నికల కమిషన్‌పై కోర్టుకెళ్తాం.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్

AP Elections 2024: ఎన్నికల కమిషన్‌పై కోర్టుకెళ్తాం.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్

ఏపీ ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు పలు ఫిర్యాదులు చేశామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో చాలా మంది అధికారులు నిమగ్నమయ్యారని.. 1000 మంది ప్రత్యేక పోలీస్ అధికారులు ఎన్నికల డ్యూటీలో ఉన్నారని.. వారిని రేపు(బుధవారం) ఇక్కడికి పిలిపించి ఓటు వేశాక తిరిగి 14న ఎన్నికల విధులకు పంపాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) తెలిపారు.

AP Elections 2024: పాపాల పెద్దిరెడ్డి నీకిక నిద్ర పట్టదు.. చంద్రబాబు మాస్ వార్నింగ్

AP Elections 2024: పాపాల పెద్దిరెడ్డి నీకిక నిద్ర పట్టదు.. చంద్రబాబు మాస్ వార్నింగ్

జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అరాచకాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి తాను, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు సీఎంగా పనిచేశామని గుర్తుచేశారు. పుంగనూరులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ’’ప్రజాగళం‘‘ వేదికగా సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి