Home » Chittoor
వారంతా నిరుపేద గిరిజనులు. మామిడి సీజన్లో కాయల కోతలకు వెళుతుంటారు. అలా ఆదివారం అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఇసుకపల్లెలో మామిడికోతకు వెళ్లారు. పని ముగించుకుని లారీలో కాయలను వేసుకుని వస్తుండగా పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఆదివారం రాత్రి లారీ బోల్తా పడింది.
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తమ్మిగానిపల్లి పంచాయతీ కర్లఘట్టలో ఓ హైడ్రామా చోటు చేసుకుంది. మునెప్ప అనే వ్యక్తికి మునెమ్మ, గంగమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.
Andhrajyothy Photographer Attacked: వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్కు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్ను మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు.
రైతుల పక్షాన తాము నిలబడుతున్నామని, చంద్రబాబు ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించడం, శుక్రవారం సాక్షి ప్రధాన పత్రికలో ఆయన కొన్ని ప్రశ్నల్ని అడగడంపై జిల్లా రైతుల్లో చర్చ నడుస్తోంది.
తాజా ఓటర్ల జాబితా మేరకు ఈనెల ఒకటో తేదీనాటికి జిల్లావ్యాప్తంగా 15,71,402 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు.
దేవదాయ శాఖ భూములకు సంబంధించి జిల్లాలో 1343.17 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయని డీఆర్వో మోహన్కుమార్ తెలిపారు.
Bandi Sanjay On TTD Staff: టీటీడీలోని అన్యమత ఉద్యోగస్థులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలతోపాటు పురాతన ఆలయాలనూ టీటీడీ అభివృద్ధి చేయాలని సూచించారు.
Bangarupalem Tour Controversy: నిబంధనలు ఉల్లంఘించి రోడ్ షో నిర్వహించినందుకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, బంగారుపాళ్యం మండల వైసీపీ పార్టీ కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి , మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ కుమార్ రాజా సహా మరికొందరిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులను పక్కకు తోసేసి వీరంగం సృష్టించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పరామర్శల పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో మామిడి రైతులని బుధవారం పరామర్శించనున్నారు.