Home » Chittoor
జిల్లాలో జూన్ నాల్గవ తేదీ నుంచి వేరుశనగ విత్తనకాయల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారి మురళీకృష్ణ తెలిపారు.
Bhuvaneswari: కుప్పంలో గృహప్రవేశ కార్యక్రమం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి, ఆమె కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం తెల్లవారుజామున గృహప్రవేశం చేశారు. ఈ నేపథ్యంలో కుప్పంలో ప్రతి ఇంటా సందడి నెలకొంది. సొంత కుటుంబ సభ్యుడే గృహప్రవేశం చేస్తున్నట్లు కుప్పం వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు.
Electric Bus Theft: తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. అయితే బస్సును చోరీ చేసిన సదరు దొంగ.. చివరకు ఓ ఘాట్ రోడ్డు వద్ద వదిలేసి పరారయ్యాడు.
31 మండలాలున్న చిత్తూరు జిల్లాలో మరో 5 మండలాలు తగ్గిపోనున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 5 మండలాలను మదనపల్లె రెవెన్యూ సబ్ డివిజన్లో కలపనున్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ పెట్టిన ప్రతిపాదన మేరకు మండలాలను విభజిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసేందుకు మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
కుప్పంలో మంగళవారం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ శిరస్సు ఊరేగింపు ఘట్టం నభూతో.. న భవిష్యతి అన్నట్టుగా సాగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనకు సర్వం సిద్ధమైంది. కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం బుధవారం జరగనుంది.
చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగుల దాడులను నియంత్రించేందుకు కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇవి పలమనేరులో ఏర్పాటు చేసిన 50 ఎకరాల ఎలిఫెంట్ క్యాంపులో శిక్షణతో కూడిన చర్యలకు ఉపయోగపడతాయి.
ఓ దుకాణం వ్యాపారిని బురిడీ కొట్టించి రూ. రూ.81వేలను ఎత్తుకెళ్లిన ఘరానా మోసగాళ్ల విషయం వెలుగులోకి వచ్చింది. సరుకులు కొనుగోలు పేరుతో.. దుకాణానికి వచ్చి ఆ షాపు యజమాని ఖాతా నుంచే నగదు మాయం చేశారు. ఇక వివరాల్లోకి వెళితే..
DD Next Level Movie: డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో గోవింద నామాలతో అసభ్యంగా పాటను చిత్రీకరించడం దారుణమని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఇలా చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.