Home » China
చైనీయులకు పర్యాటక వీసాలను పునరుద్ధరించాలని భారత్ నిర్ణయం తీసుకుంది. గల్వాన్ లోయలో 2020లో జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య టూరిస్ట్ వీసా సేవలు నిలిచిపోయాయి.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్కు చైనా సాయపడుతోందని ఆది నుంచీ పలు మీడియా కథనాల ద్వారా వెల్లడవుతూనే ఉంది. అయితే.. ఈ కథనాలను నిజంచేసేలా యూఎస్ రిపబ్లికన్ పార్టీ సభ్యులొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకెళితే...
చైనాలో టెక్నాలజీ మరో కొత్త దశలోకి ప్రవేశించింది. అక్కడి హాంగ్జౌ నగరంలోని ఒక రెస్టారెంట్లో పని చేసే రోబో వెయిటర్లు మీరేం తినాలో చెబుతాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో పని చేసే ఆ రోబో వెయిటర్లు కస్టమర్ల మొహం, నాలుకను స్కాన్ చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో సూచిస్తాయి.
చైనా నుంచి తీసుకున్న శాటిలైట్తో ఇరాన్ యూఎస్ స్థావరాలపై నిఘా పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్కు తాము ఆయుధాలు పంపడం లేదని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పష్టం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వెల్లడించారు. ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందన్న వార్తలు కొద్ది రోజులుగా వెలువడుతున్న సంగతి తెలిసిందే.
అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ చైనా నౌక ఒకటి హోర్ముజ్ను దాటినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. ట్రంప్ కారణంగానే హోర్ముజ్ జలసంధికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చైనా వ్యాఖ్యానించింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ దిగ్బంధన హెచ్చరికలతో అంతర్జాతీయంగా కలకలం రేగుతోంది. దీనిపై చైనా తీవ్రంగా స్పందిస్తూ, అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలగకుండా అడ్డంకులు లేని మార్గాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చింది.
అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెడుతుండటాన్ని భారత్ ఖండించింది. అక్కడి ప్రాంతాలకు పేర్లు పెట్టడం వల్ల అరుణాచల్ చైనాది అయిపోదని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది.
గత 40 రోజులుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్పై దాడులను రెండు వారాల పాటు ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.