Home » Chevireddy Bhaskar Reddy
Andhrapradesh: వైసీపీ నేతలు 5 ఏళ్ల పాటు ల్యాండ్, శాండ్, వైన్, మైన్లో సంపాదించింది చాలక పేదలు భూమలు లాక్కుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి తుమ్మలగుంటలో హాథీరాంజీ మఠం స్థలంలోని పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
AP Elections 2024: కష్టాల్లో ఉన్నప్పుడు రారమ్మని పిలిచారు. అధికారంలోకి రాగానే ఎదురుదాడి ప్రారంభించారు. తొలుత ఆర్థిక వనరులపై దాడి. ఆ తర్వాత ఆయన మాటచెల్లకుండా అధికారులపై ఆంక్షలు. ఇంకోవైపు కేంద్రం నుంచి అభివృద్ధి పనులకు నిధులు తెస్తే రాష్ట్రా వాటా నిధులివ్వకుండా అడ్డుకోవడం. ఎదురువెళ్లి నమస్కరించినా అగౌరవపరిచి పొమ్మనకుండా పొగబెట్టడం. తాజాగా సోషల్ మీడియాలో పాపమంతా బీజేపీదే అన్న అసత్య ప్రచారాలకు దిగడం.
ప్రకాశం జిల్లా: ఒంగోలు లోక్ సభ ఇన్చార్జ్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకంపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. నిన్న చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు ఇచ్చేది లేదని బాలినేనికి చెప్పిన వైసీపీ పెద్దలు.. 24 గంటలు గడవకముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు.
Balineni Issue : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకు రోజుకూ హీటెక్కుతున్నాయి. అధికార వైసీపీలో ఇంచార్జుల నియామకంతో పార్టీలో అల్లకల్లోల్ల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకూ మూడు ఇంచార్జుల జాబిలతాను రిలీజ్ చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. త్వరలో మరిన్ని మార్పులు, చేర్పులు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టారని టాక్..