Home » Chennai News
పాఠశాలలో క్షుద్రపూజలు నిర్వహించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కాగా.. సమాచారమందుకున్న పోలీసులు పాఠశాలను సందర్శించి విచారణ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డీఎంకే తరుపున రూపుదిద్దుకోనున్న మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుందని ఎంపీ కనిమొళి అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, మహిళలకు హక్కులు, అన్నదాతలకు భద్రత వంటి అంశాలపై మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
కొద్దిరోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని నటుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు శరత్కుమార్ తెలిపారు. అలాగే... తమిళగ వెట్రి కళగం అని పూర్తిగా చెబితే తనకు అర్ధం కావడం లేదని, టీవీకే, ఈవీకే, ఎంవీకే అని చెబితే అర్ధమవుతుందంటూ ఆయన పేర్కొనడం గమనార్హం,
క్రిస్మస్ పండుగను పురష్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-వేలాంకణి మధ్య మంగళవారం) రాత్రి 7.25గంటలకు ఓ రైలు. అలాగే.. బుధవారం సాయంత్రం 5.30గంటలకు మరో రైలు వేలాంకణికి బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.
తమిళనాడు రాష్ట్రంలో 2017 ఏప్రిల్ 23న కొడనాడు ఎస్టేట్లో జరిగిన హత్య కేసులో ముగ్గురికి అరెస్టు వారెంటు జారీ అయింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నీలగిరి జిల్లాలో కొడనాడు ఎస్టేట్ పేరుతో విలాసవంతమైన భవనం ఉండగా సెక్యూరిటీ గార్డును హతమార్చి అందులోని నగదు, నగలు ఎత్తుకెళ్లారనే విమర్శలొచ్చాయి.
రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం.. ఆత్మహత్యల రాజధానిగా మారుతోంది.. అని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే గవర్నర్ కు, అధికార డీఎంకే పార్టీల మధ్య పెద్ద యుద్దమే జరుగుతోంది. మళ్లీ.. గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడంపై వివాదం ఎంతవరకు వస్తుందోననే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఆ రెండు రకాల కుక్కల్ని పెంచవద్దని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పేర్కొంది. చూపరులకు భయం కలిగేలా మొరిగే పిట్బుల్, రాట్వీలర్ శునకాలను పెంచవద్దని జీసీసీ తెలిపింది. ఈ మేరకు అంతే కాకుండా ఈ రెండు రకాలకు చెందిన శునకాలను పెంచితే రూ.లక్ష చొప్పున జరిమాన విధిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొత్తం ఓటర్ల వివరాలను ప్రటించారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 97,37,832 ఓటర్లను తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు.
రాష్ట్రంలో.. ల్యాప్లాప్లు పంపిణీ చేయడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఫిబ్రవరిలోగా 10లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయాలన్నదే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఓట్ల కోసమే ల్యాప్లాప్లు పంపిణీ చేస్తున్నారని వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్తో ఎవరినీ పోల్చలేమంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. మరికొద్ది రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పొలిటికల్ హీట్ పెరిగింది.