Home » BRS Chief KCR
ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్కు దోస్తానా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కవితనే ఈ విషయం స్వయంగా చెబుతున్నారని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోని భూభకాసురుల సంగతి త్వరలో తెలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు.
MP Chamala Kiran Kumar Reddy: మిస్ వరల్డ్ పోటీలను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని .. కానీ ఆ పోటీలను చూసి కేటీఆర్ అసూయ పడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అందాల పోటీలు కేటీఆర్ ఊసు లేకుండా జరుగుతున్నాయని బాధపడుతున్నారని తెలిపారు.
Adi Srinivas: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ పచ్చి నిజాలు చెప్పారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనుంది. సభలో కేసీఆర్ కాంగ్రెస్ మరియు బీజేపీలపై విమర్శలు చేస్తారని సమాచారం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్రారంభం, కేసీఆర్ నాయకత్వం, మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. అవినీతిపై విమర్శలు, అభివృద్ధి లోపాలు, నిరుద్యోగం, బడ్జెట్ సమస్యలు తెలంగాణ ప్రజలకు పెరిగిన సమస్యలుగా మారాయి
KCR: తెలంగాణ అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలపై అసెంబ్లీలో ఎండగడతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈరోజు జరుగుతున్న సమావేశంలో నేతలకు కేసీఆర్ వ్యూహారచన చేయనున్నారు.
KCR: రేవంత్ ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని అన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని అన్నారు. గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటు అని చెప్పారు. రాబోయే ఫిబ్రవరి నెల చివరిలో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ENO: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. అలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు భయటపడకుండా హెడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. పేదల భూములు రేవంత్ జాగీర్ కాదని హెచ్చరించారు. చెరువులు, వాగుల రక్షణకు భూసేకరణ చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం సకలజనుల సర్వే చేసింది..కానీ ఇప్పటివరకు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. సకలజనుల రిపోర్ట్ ఎక్కడకి పోయిందని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లను నిలదీశారు.