Home » Bihar
బిహార్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్రానికి రూ.4.06 లక్షల కోట్ల రుణాలున్నాయని, ప్రతిరోజూ రూ.63 కోట్లు వడ్డీ కింద చెల్లింపులు జరుగుతున్నాయని పవన్ వర్మ తెలిపారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఇంట్లో విభేదాలు చెలరేగాయి. తాను ఆర్జేడీ పార్టీ, కుటుంబం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన ఆయన కుమార్తె రోహిణి ఆచార్య.. తాజాగా తన సోదరుడు తేజస్విపై తీవ్ర ఆరోపణలు చేశారు.
బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న తేదీతో ముగియనుంది. దీనికి ముందే 18వ అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తొలుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పిస్తారు.
243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. 2010 తర్వాత దారుణమైన ఫలితాలు వచ్చిన రెండో సందర్భం ఇది. అప్పటి ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 22 సీట్లు గెలుచుకుంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పరాజయం పాలైన మరుసటి రోజే రోహిణి ఆచార్య ఈ ప్రకటన చేయడం సంచలనమైంది. ఆర్జేడీ కుటుంబంలో అంతర్గత కలహాలే ఇందుకు దారితీసుండవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
సీట్ల షేరింగ్ ఫార్ములాలో భాగంగా 143 సీట్లలో ఆర్జేడీ పోటీ చేసి కేవలం 25 సీట్లలో గెలిచింది. 23 శాతం ఓట్ షేర్ రాబట్టింది. గత ఎన్నికల్లో ఇది 23.11గా ఉంది. గత ఎన్నికల్లోనూ 144 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసింది.
ఆర్కే సింగ్ ఎన్నికల సమయంలో పలువురు ఎన్డీయే నేతల అవినీతి, ఫ్యాక్షనిజంపైన ఆరోపణలు చేయడంతో పాటు శాంతిభద్రతల నిర్వహణపై ఎన్నికల కమిషన్ను బహిరంగంగానే తప్పుపట్టారు. మొకామాలో జరిగిన హింసాకాండపై ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల కమిషన్పై విమర్శలు గుప్పించారు.
బిహార్ లో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. రామ్గఢ్ అసెంబ్లీ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ బీజేపీకి చెందిన అశోక్ కుమార్ సింగ్ను కేవలం 30 ఓట్ల తేడాతో ఓడించి, సంచలనం సృష్టించారు.
బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం బెంగాల్పై ఉండదని టీఎమ్సీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. బెంగాల్లో బీజేపీ నేతల సంబరాలు నిర్హేతుకమని కామెంట్ చేశారు. రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు వేర్వేరని వివరించారు.
బిహార్ ప్రజలు ఎన్డీయేకు చారిత్రక తీర్పు ఇచ్చారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కట్టా సర్కార్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదంటూ విపక్ష కూటమికి చురకలు అంటించారు.