Home » Bihar
లోక్సభ ఎన్నికల వేళ బీహార్లోని ముజఫర్పూర్ బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీకి చెందిన అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన నిషాద్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోని లోక్సభ అభ్యర్థుల తుది ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఆ క్రమంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) న్యూఢిల్లీలో సమావేశమైంది.
బీహార్లో బీజేపీకి బిగ్ రిలీఫ్ లభించింది. పొత్తుల్లో భాగంగా తమ పార్టీకి ఒక సీటు కేటాయించకపోవడంపై ఆగ్రహంతో ఉన్న ఆర్ఎల్జేపీ అధినేత పశుపతి పరాస్ అలక వీడారు. తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోదని ప్రకటించారు.
లోక్సభ ఎన్నికల్లో పొత్తులతో కాంగ్రెస్లో టికెట్లు దక్కని నేతలతొ ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కొంమతంది నేతలు టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతుంటే.. మరికొందరు నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశలో 102 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగు స్తుండటంతో.. ఎక్కడ ఎవరు పోటీలో ఉండనున్నరో క్లారిటీ రానుంది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి అధికారం లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా.. ఎన్టీయే (NDA) కూటమి వ్యతిరేక పార్టీలను ఏకం చేసి ఇండియా పేరుతో కూటమి కట్టాయి. కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని యూపీఏ కూటమి స్థానంలో వివిధ పార్టీల కలయికతో ఇండియా కూటమి ఏర్పడింది.
'ఇండియా' కూటమి భాగస్వామ్య పక్షాలుగా ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య బీహార్ లోక్సభ ఎన్నికల్లో పొత్తు ఖరారైంది. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్కు 9 సీట్లను ఇవ్వాలని ఆర్జేడీ నిర్ణయించింది. పూర్ణియా నియోజవర్గంతో సహా 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది.
పూర్ణియా సీటును వదులుకునే ప్రసక్తే లేదని పప్పు యాదవ్ అంటున్నారు. అవసరమైతే ఈ ప్రపంచాన్ని వీడేందుకు సిద్ధం. కానీ పూర్ణియాలోని ప్రజలకు ఎప్పటికీ దూరం అవనని తేల్చి చెప్పారు. పూర్ణియా లోక్ సభ స్థానాన్ని తాను వీడటం అంటే ఆత్మహత్య చేసుకున్నట్టేనని ప్రకటించారు. ఇక్కడ బీజేపీని నిలువరించేందుకు గత 40 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నానని తెలిపారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏడు దశల్లో జరగనుంది. మొదటి దశలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ (Lok Sabha) స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈరోజుతో ముగుస్తుంది. బీహార్(BIHAR)లో మాత్రం నామినేషన్ల గడువు రేపటితో ముగుస్తుంది.
దేశ వ్యాప్తంగా హోలీ సంబరాల కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లిన ప్రజలు, అక్కడి నుంచి తిరుగు పయనమవుతున్న వారిలో రైళ్లు రద్దీగా మారాయి. నెలల ముందు నుంచే టికెట్ బుక్ చేసుకున్నా కన్ఫార్మ్ కాని పరిస్థితి.