Bihar: రెండు మూడ్రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు.. చర్చలు షురూ..
ABN , Publish Date - Nov 15 , 2025 | 09:08 PM
బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న తేదీతో ముగియనుంది. దీనికి ముందే 18వ అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తొలుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పిస్తారు.
పాట్నా: బిహార్లో ఎన్డీయే ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ మరో రెండు మూడు రోజుల్లో లాంఛనంగా ప్రారంభం కానుంది. గెలిచిన ఎమ్మెల్యేలతో పాట్నాలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు విడివిడిగా సమావేశమవుతున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలంతా పాట్నా చేరుకోగానే చర్చలు వేగవంతమవుతాయని చెబుతున్నారు.
బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న తేదీతో ముగియనుంది. దీనికి ముందే 18వ అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తొలుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారు. ప్రమాణస్వీకారం తేదీ ఖరారుపై చర్చిస్తారు.
నితీశ్ను కలిసిన పాశ్వాన్
బిహార్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ను కూటమి నేత, లోక్జనశక్తి పార్టీ (రామ్విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ శనివారం నాడు ఆయన నివాసంలో కలుసుకున్నారు. చారిత్రక విజయం నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎంను అభినందించినట్టు పాశ్వాన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 19 స్థానాలను ఎల్జేపీ (రామ్విలాస్) గెలుచుకుంది. ఈ నేపథ్యంలో నితీశ్ను కలవడం ద్వారా పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవిపై పాశ్వాన్ దృష్టిపెట్టినట్టు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు కూడా బిహార్లో నితీశ్, కేంద్రంలో మోదీ అంటూ ప్రచారం సాగించిన ఎన్డీయే అధికారికంగా నితీశ్ను సీఎంగా ప్రకటించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
బిహార్ గెలుపును సాకారం చేసిన MY ఫార్ములా
ఓటమితో విచారం, విజయంతో అహంకారం ఉండదు.. తొలిసారి స్పందించిన ఆర్జేడీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.