Home » Bhatti Vikramarka Mallu
సినీ కళాకారుల మాదిరిగానే రంగస్థల కళాకారులకూ అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నాటక రంగ పోటీలను నిర్వహించి ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాల అమలుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని దేశంలోనే అత్యుత్తమ వర్సిటీగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
దేశంలో కీలక ఖనిజాల (క్రిటికల్ మినరల్స్) మైనింగ్లో తెలంగాణ ప్రధాన భూమిక పోషించనుందని.. ఖనిజాల సాంకేతికత, మైనింగ్ రంగంలో పరస్పర సహకారానికి క్వీన్స్లాండ్ (ఆస్ట్రేలియా) ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం (బీటీపీఎ్స)లో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయించాలంటూ జెన్కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
రాష్ట్రంలో పోలీసు క్వార్టర్లను నిర్మించాల్సిన అవసరం ఉందని, ఎక్కడెక్కడ అవసరాలున్నాయో వెంటనే ప్రతిపాదనలు పంపాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పోలీసు శాఖను ఆదేశించారు.
ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఎట్లా తప్పో చెప్పాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలకు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. బట్ట కాల్చి మీద వేయడం కాదని, రాష్ట్రంలోని ఏ బ్లాక్లోని ఏ ఇంట్లో లెక్క తప్పు జరిగిందో చూపాలన్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ యువతకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.3 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలను అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉన్నత విద్యపై కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం తగదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. యూనివర్సిటీలకు నిధుల కేటాయింపు, నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పజెప్పి.. వైస్ చాన్స్లర్ల నియామకాలు, అడ్మిషన్లు వంటి కీలక బాధ్యతలను కేంద్రం తన వద్దే పెట్టుకోవడం సరికాదన్నారు.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతానికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ చేయించుకునే దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.