Home » Bhatti Vikramarka Mallu
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత తనదేనని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తాను చీఫ్ విప్గా ఉన్న సమయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమావేశపరిచి అధిష్ఠానానికి ఒక నివేదిక ఇచ్చి తప్పకుండా అమలు చేయాలని కోరానని గుర్తు చేశారు.
భూగర్భంలో విద్యుత్ తీగలను ఏర్పాటు చేసి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయడంపై దృష్టి సారించాలని విద్యుత్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
గణతంత్ర దినోత్సవం రోజు, జనవరి 26 నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్న రైతు భరోసా పథకం కోసం రూ.8,400 కోట్లు సిద్ధం చేశామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
రాష్ట్ర బడ్జెట్పై కసరత్తు ప్రారంభమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను స్వీకరించింది.
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎ్సహెచ్జీ) ద్వారా ఏర్పాటు చేసే సౌర విద్యుత్తు ప్లాంట్ల టెండర్లను త్వరలో ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
అధికారం వచ్చి ఏడాది గడిచింది. మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఇకనైనా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన కార్యకర్తలకు న్యాయం చేయండి.. వారిని కాపాడుకోండి.
వసతి గృహాల్లోని విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కాస్మెటిక్ చార్జీలు పెంచామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
CM Revanth Reddy: సివిల్స్లో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. బీహార్ నుంచి అత్యధికంగా సివిల్స్లో రాణిస్తున్నారని అన్నారు. అలాంటి ప్రత్యేక శ్రద్ధ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండాలని, వారికి ఆర్థికంగా సహకారం అందించాలని రాజీవ్ సివిల్స్ అభయహస్తం ద్వారా రూ.లక్ష సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ హామీలు అమలు చేయమంటే రేవంత్ దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధ్వజమెత్తారు. వరంగల్ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ చెత్త బుట్టలో వేసిందని విమర్శించారు. రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తామని పచ్చి మోసానికి సీఎం రేవంత్ తెరదీశారని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల్లో జల, సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హిమాచల్ప్రదేశ్లో జల విద్యుత్, రాజస్థాన్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఆయా రాష్ట్రాలతో కలిసి ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు.