Home » Bharath
పిల్లల కోసం అనేక ఉత్పత్తులను తయారు చేసే ప్రముఖ కంపెనీ నెస్లే(Nestle) గురించి అనేక మందికి తెలుసు. అందులో సెరెలాక్(Cerelac) ఉత్పత్తి కూడా ఒకటి. అయితే ఆసియా, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాల్లో పంపిణీ చేసే సెరెలాక్ ఉత్పత్తుల్లో అత్యధిక స్థాయి చక్కెరను ఉపయోగించి ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్విట్జర్లాండ్లోని పబ్లిక్ ఐ అనే పరిశోధనా సంస్థ షాకింగ్ నివేదికను వెల్లడించింది.
అమెరికాకు చెందిన గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్(Moodys) 2024లో భారత్ వృద్ధి మందగించవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత సంవత్సరంలో ఇండియా 6.1 శాతం జీడీపీ(GDP) వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఇది గతేడాది అంటే 2023లో 7.7 శాతం వృద్ధి కంటే తక్కువగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువగా ఉండటం ఏంటని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే అందుకు గల కారణాలను కూడా వెల్లడించింది.
దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ( India ) పై దుష్ప్రచారం చేసేవారికి తగిన గుణపాఠం చెబుతామని చైనా, పాకిస్థాన్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు.
భారత్ రైస్(Bharat Rice) మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు, వ్యాపారుల ద్వారా విక్రయాలు మొదలయ్యాయి. నేషనల్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్)(NAFED), నేషనల్ కో–ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ వంటి సంస్థలకు కేంద్రం విక్రయ బాధ్యతలను..
భారతదేశంపై అమెరికా రాయబరి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్ తీర్చిదిద్దడంలో భారతదేశం ముఖ్యపాత్ర పోషిస్తుందని వివరించారు. భవిష్యత్ను ఆస్వాదించాలని అనుకుంటే భారత్ రండి, ఇక్కడ పనిచేయాలని పిలుపునిచ్చారు.
మాల్దీవులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి పరిమిత స్థాయిలో బియ్యం, గోధుమలు సహా పలు నిత్యావసర వస్తువుల ఎగుమతికి భారత ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ వస్తువుల ఎగుమతిపై ఏప్రిల్ 1 నుంచి 2024-25 సంవత్సరానికి నిషేధం ఉంది. అయితే ఇప్పుడు మాల్దీవులు చేసిన విజ్ఞప్తిపై ఆ దేశానికి నిత్యావసర వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది.
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) కచ్చతీవు దీవులపై చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షమైన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని తీవ్ర వ్యా్ఖ్యలు చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థకు(Indias economy) మంచి రోజులోచ్చాయా? అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా 2024లో భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా(forecasts) వేసింది. ప్రపంచ బ్యాంకు(World Bank) ఇంతకుముందు ఈ అంచనాను 6.3 వద్ద ఉంచడం విశేషం. అది ఇప్పుడు ఏకంగా 7.5కి పెంచింది.
వాస్తవాధీన రేఖ వద్ద డ్రాగన్ దేశం నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టింది. ఈ చర్యను భారత్ ( India ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇలా ఇప్పడే కాదు గతంలోనూ పలు మార్లు పేర్లు మారుస్తూ మూడు జాబితాలను రిలీజ్ చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా చైనా, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇండియాలోని కొన్ని ప్రాంతాలకు డ్రాగన్ కంట్రీ పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన భారత్ ఇలాంటి చర్యలు మానుకోవాలని చైనాకు సూచించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని, చైనా పెడుతున్న ఈ పేర్లు వాస్తవాలను మార్చలేదని భారత్ ఘాటుగా స్పందించింది.