Home » Bharat Ratna
భారతమ్మ బంగారు ముద్దు బిడ్డ, రాజనీతిజ్ఞుడు, బహూ బాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన మహానేత. పీవీ నరసింహా రావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు వరించింది.
PV Narsimha Rao Chaudary Charan Singh MS Swamynathan: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చాలా పకడ్బందీగా అడుగులు వేస్తోంది. విపక్షాల వైపు ప్రజల దృష్టి మళ్లకుండా.. తనదైన వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్డీయే సర్కార్. ఇప్పటికే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంతో ఎంతో కీర్తిప్రతిష్ఠలు సంపాదించిన మోదీ సర్కార్..
రైతు దూత.. దేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ను భారతరత్నతో భారత ప్రభుత్వం గౌరవించింది. ప్రధాని మోదీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. జూలై 28, 1979 నుంచి జనవరి 14, 1980 మధ్యకాలంలో దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించిన ఆయన జీవిత విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
భారతదేశ మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు, చౌదరి చరణ్సింగ్లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించారు.
భారత మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది.
మాజీ ఉప ప్రధాని, రాజకీయ భీష్ముడు, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ స్పందించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
‘భారత రత్న’ అవార్డుకు ఎంపికైన ఎల్కే అద్వానీ(LK Advani)కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభినందనలు తెలిపారు. భారత రాజకీయాల్లో అద్వానీ తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారని కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ (Bharat Ratna) ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు.
ఎల్కే అద్వానీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు మార్మోగుతోంది. ఆయన సేవలకుగానూ దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటిస్తున్నట్లు కేంద్రం శనివారం వెల్లడించింది. ఎల్కే అద్వానీ(LK Advani) పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ.