Home » Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో 40 ఏళ్ల కిత్రం బొగ్గు అన్వేషణ కోసం 8 బోర్లు (డ్రిల్స్) వేయగా.. వాటిల్లో నుంచి వేడి నీరు రావడం ప్రారంభమైంది.
భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం నిట్టనిలువునా కూలిపోయింది.. ఇద్దరు తాపీ మేస్త్రీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. అందులో మేస్త్రీ కామేష్ను సహాయక బృందాలు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Building Collapse: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతల పెట్టిన విమానాశ్రయానికి ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి. అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై చేపట్టిన అధ్యయనం తుది దశకు చేరుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ.. ఛత్తీస్గడ్ సరిహద్దు వద్ద హై అలర్ట్ చేశారు. మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు నిర్మించ తలపెట్టిన నేపథ్యంలో అక్కడ అధ్యయనం జరిపేందుకు కేంద్రం నిర్ణయించింది.
భూ సర్వే, నాలా కన్వర్షన్ కోసం లంచాలు తీసుకుంటూ సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్లు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత 5 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో ములుగులోని మేడారం కేంద్రంగా 3-7 సెకన్ల పాటు కొనసాగిన ప్రకంపనలతో కొన్ని చోట్ల ఇళ్ల గోడలు, నేల బీటలువారాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టుల కదలికలు కొంత తగ్గుముఖం పట్టినా.. అడపాదడపా జరిగిన ఎన్కౌంటర్లలో 60మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు.