Home » Bhadradri Kothagudem
Telangana: భద్రాచలంలో ‘‘ఇందిరమ్మ ఇళ్లు’’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాముల వారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం నాడు రామాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ దంపతులకు దేవస్థానం అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామచంద్ర స్వామి వారిని ముఖ్యంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉపాలయం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో రేవంత్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు.
అవినీతి ఆరోపణలపై భద్రాద్రి రామాలయ (Bhadradri Sri Rama Temple) ఏఈవో శ్రావణ్ కుమార్పై విచారణ చేపట్టారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వసతి గదుల నిర్మాణం అనుమతుల కోసం తమ వద్ద నుండి దేవస్థానానికి చెందిన ఏఈవో రూ.17లక్షలు తీసుకున్నారంటూ ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ...
భద్రాద్రి రామాలయం(Bhadrachalam Sri Rama Temple) లో భారీ మోసం వెలుగుచూసింది. ఆలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అధికారి చేసిన అవినీతి దందా ఆలస్యంగా బయటపడింది. మూడేళ్ల క్రితం సత్రం నిర్మాణానికి దాతలు రూ.18 లక్షల నగదును ఆలయానికి ఇచ్చారు.
Telangana: జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. చండ్రుగొండ మండలంలో ఎలుగుబంటి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఎలుగుబంటి వరుస దాడులతో మండల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Telangana: బీటీపీఎస్ను పరిశీలించడానికి, అవగాహన చేసుకోవడానికి, రివ్యూ రూపేనా తెలుసుకున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..విద్యుత్ సెక్టార్ను గత ప్రభుత్వం అప్పుల ఊబిగా మార్చిందని విమర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం: కమ్మ జాతి చరిత్ర గర్వ కారణమని, పౌరుషం దాతృత్వం కలిగిన కమ్మ జాతి దేశం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా అతి భారీ వర్షం కురుస్తోంది. ఏకాదటిగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేరు శెనగ, వరి, పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లింది.
Telangana Elections: జిల్లాలో గతకొద్దిరోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రచారం ముగిసింది. నాలుగు గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అవగా.. 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. ఈనెల 30న ఉదయం 7 గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
Telangana Elections: తెలంగాణలో బీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం సీపీఐ అభ్యర్థి కూనంనేనికి మద్దతుగా రామకృష్ణ ప్రచారం నిర్వహించారు.