Home » Bhadrachalam
Bhadrachalam Ram Navami LIVE: భద్రాచల క్షేత్రంలో(Bhadrachalam) మహా కమనీయ ఘట్టం.. రాములోరు, సీతమ్మ కళ్యాణమే! ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. ఇవాళే సీతారాముల కళ్యాణం(Seetharamula Kalyanam)! శీరామ నవమి(Ram Navaami 2024) సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ఉండటంతో కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భద్రాచలం వెళ్లడం..
భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామ నవమి పర్వదినం సందర్బంగా బుధవారం భద్రాచల క్షేత్రం రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. రామయ్య కళ్యాణం కోసం భద్రాద్రి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరుగుతుంది.
Telangana: శ్రీ సీతారాముల కళ్యాణం.. కమనీయం. ప్రతీఏటా భద్రాచంలో శ్రీసీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రామయ్య కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు భద్రాద్రికి తరలివస్తుంటారు. ప్రత్యక్షంగా కళ్యాణాన్ని చూసేందుకు వీలుకాని వారు.. లైవ్ టెలికాస్ట్ ద్వారా కోట్లాది మంది భక్తులు టీవీల్లో వీక్షించి తరిస్తుంటారు. శ్రీసీతారాముల కళ్యాణాన్ని చూస్తూ భక్తులు పరవశించిపోతుంటారు.
శ్రీరామనవమికి భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. రేపు సీతారాముల కళ్యాణం కోసం మిథిలా ప్రాంగణం లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
గోదావరి వరదలతో భద్రాద్రివాసులకు ముంపు బెడద లేకుండా ఇకపై కరకట్ట పూర్తిస్థాయి రక్షణ గోడగా నిలవనుంది. భద్రాచలం(Bhadrachalam) సుభాష్ నగర్ కాలనీ వద్ద నుంచి చేపట్టాల్సిన మిగులు కరకట్ట నిర్మాణ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోక్షం లభించింది.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో రెండవ రోజు బుధవారం వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మండల లేఖ, కుండ, కలశ, యాగశాల అలంకరణ జరగనుంది. సాయంత్రం సార్వభౌమ వాహన సేవ జరుగుతుంది.
ఎన్నో ఉద్విగ్నవేళల్ని, ఆపదలను తరిమి... అద్భుతాలను ప్రసాదించే ఈ శ్రీరామరక్షాస్తోత్రాన్ని ఈ శ్రీరామ నవమి కానుకగా వారాహి చలన చిత్రం అధినేత, శివవారాహీ ట్రస్ట్ చైర్మన్ , శ్రీ అమృతేశ్వరస్వామి దేవాలయం సంస్థాపకుడు సాయి కొర్రపాటి భద్రాచలం శ్రీరామనవమి వేడుకకు విచ్చేసే వేలాది భక్తులకు ఉచితంగా అందజేసే సదుద్దేశంతో సుమారు యాభైవేల ప్రతులను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంకి అందజేయనున్నారు.
Telangana: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ నీలిమేఘశ్యాముడు ఈరోజు (సోమవారం) పెళ్లి కొడుకు అవనున్నాడు. కళ్యాణ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో డోలోత్సవం, అనంతరం వసంతోత్సవం నిర్వహించనున్నారు. ముత్తైదువులు ఈరోజు పసుపు కొట్టి పనులు ప్రారంభించి కళ్యాణ తలంబ్రాలు కలుపనున్నారు. ఏప్రిల్ 17న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగనుంది.
శ్రీరామనవమి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో ఉత్సవాలకు భద్రాద్రి ( Bhadrachalam ) రామయ్య సిద్ధమవుతున్నాడు. నేడు సీతారాముల కళ్యాణ పనులకు అంకురార్పణ జరగనుంది.
Bhadradri: భద్రాద్రి రామాలయం(Bhadrachalam Temple) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక భక్తులను(Devotees) దృష్టిలో ఉంచుకుని ఉచిత దర్శనం(Free Darshan) అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది. అధికారుల నిర్ణయం ప్రకారం.. భద్రాచలం స్థానికులు తమ గుర్తింపు కార్డును చూపి..