Home » Bengaluru News
రాష్ట్ర ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేస్తూ, గ్యారంటీల పేరిట రాష్ట్రాన్ని నిలువు దోపిడీచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని జేడీఎస్ పార్టీ రాష్ట్ర యువఅధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి అన్నారు.
ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ విజయోత్సవాలు హడావుడిగా జరపడమే తొక్కిసలాటకు కారణమని బీజేపీ మండిపడింది. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఫ్రీడంపార్కులో నిరసన చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్షనేతలు అశోక్, చలవాది నారాయణస్వామి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన సాగింది.
అభివృద్ధి విషయంలో కేంద్రం మాకు ద్రోహం చేసిందనే విషయంలో నేను అబద్ధాలు చెప్పినట్టు నిరూపిస్తే ఇకపై వేదికలపై ప్రసంగాలు చేసేది లేదని సీఎం సిద్దరామయ్య సవాల్ విసిరారు. దావణగెరె జిల్లాలో సోమవారం రూ.1350 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడి మార్పు హైకమాండ్ నిర్ణయమే తప్పా మరెవ్వరో చర్చించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి స్పష్టం చేశారు. అదే సమయంలో తమ స్థానాలు మిగిల్తే చాలంటూ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తుంగభద్ర ఆయకట్టు క్రస్ట్గేట్లకు కాలం చెల్లడంతో జలాశయానికి సంబంధించి 32 గేట్లను మార్చాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో.. ఈ ఏడాది జలాశయంలో పూర్తి స్థాయిలో కాకుండా 80 టీఎంసీల నీరు నిలపాలని అధికారులు నిర్ణయించారు.
వ్యవసాయశాఖకు అనుబంధమైన ఆహార సంస్కరణ విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి(Rohini Sindhuri)ని కార్మికశాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కర్ణాటక రాష్ట్రం కంప్లి తాలుకా పరిధిలోని సన్నాపురం గ్రామంలో బుధవారం నదిలో స్నానం చేస్తున్న యువకుడిపై మొసలి దాడి చేసింది. యువకుడు కేకలు వేయడంతో మొసలి నదిలోకి పరుగు తీసింది.
తుంగభద్ర ఆయకట్టు రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. కాల్వల్లోకి నీరు రాకున్నా నారు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. నదీ జలాలు, బోర్లు, డ్యాం నీరు ఆధారంగా బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో 7లక్షల హెక్టార్ల ఆయకట్టు పైగా ఉంది.
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆగస్టు 15నుంచి ప్లాస్టిక్ కవర్ల నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తామని దేవదాయశాఖ మంత్రి రామలింగారెడ్డి పేర్కొ న్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పశ్చిమకనుమలలో వర్షాలు ఆగడం లేదు. మలప్రభ నదికి ఇన్ఫ్లో పెరిగింది. దీంతో బెళగావి జిల్లా ఖానపుర తాలూకా కడకుంబి వద్ద నీరు పొంగిప్రవహిస్తోంది. కుసుమళి గ్రామం వద్ద నదికి అడ్డంగా బ్రిడ్మ్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భారీగా నీరు రావడంతో ఇబ్బందికరం ఏర్పడింది. కొంతమేర రోడ్డు కొట్టుకుపోయింది.