Home » BCCI
టీమిండియా కోచింగ్ స్టాఫ్లో పలు కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్లోని ఓ కీలక సభ్యుడు తన పదవికి వీడ్కోలు పలికి.. ఐపీఎల్లోని ఓ ఫ్రాంచైజీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సదరు ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.
భారత జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో.. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత మళ్లీ తుది జట్టులోకి రావడం అంతకంటే కష్టం. ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. వైభవ్ను జట్టు నుంచి తప్పించడంపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతుల్లో వరుసగా టీ20 సిరీస్లు కోల్పోవడంతో జట్టు ప్రదర్శనపై బీసీసీఐ దృష్టి సారించింది. అయితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై తక్షణ చర్యలు తీసుకునే ఆలోచన లేదని బోర్డు స్పష్టం చేసింది.
వరుసగా రెండు సిరీస్లు చేజార్చుకున్న భారత టీ20 జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భారత జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
భారత మహిళా జట్టు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఆతిథ్య ఇంగ్లండ్తో జరుగుతున్న ఈ ఏకైక టెస్టులో.. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది.
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ను ఒక మ్యాచ్ ఉండగానే భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత ప్లేయర్ల ప్రదర్శనపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరును బోర్డు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
నాలుగో టీ20లో ఇంగ్లండ్పై 9 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోవడంపై టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పిచ్లపై భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోందని.. ఈ వాస్తవాన్ని అంగీకరించాలని స్పష్టం చేశాడు.
టీ20 ప్రపంచ కప్లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించిన భారత మహిళల జట్టు.. మరో కీలక పోరులో బరిలోకి దిగనుంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో ఏకైక టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్లో.. ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్2026 ఛాంపియన్గా అవతరించిన కొద్దిరోజుల్లోనే టీమిండియా ప్రదర్శన ఘోరంగా దిగజారింది. వరుస ఓటముల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇంగ్లండ్తో మూడో టీ20లోనూ భారత్ పూర్తిగా విఫలమైంది. ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఓటమిపై మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.