Home » Bangladesh
ప్రియాంకతో పాటు విపక్ష ఎంపీలు సైతం పార్లమెంటులో అడుగుపెట్టడానికి ముందు సభా ప్రాంగణం వెలుపల ప్లకార్డులు, బ్యాగులు పట్టుకుని పొరుగుదేశం (బంగ్లా)లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హిందూ కమ్యూనిటీని కూకటి వేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతోనే బంగ్లాలో హింస జరుగుతోందని సునీల్ అంబేకర్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్లో మాత్రమే కాదు, పాకిస్థాన్లోనూ హిందువులపై దాడులు జరుగుతున్నాయని, హిందువులపై దాడులను మనం ఎంతమాత్రం సహించరాదని సూచించారు.
బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు ప్రజలు సైతం మద్దతు ప్రకటించారు. దీంతో ఈ నిరసన హింసాత్మకంగా మారింది. దాంతో పరిణామాలు తీవ్రంగా మారాయి.
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుండడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆలయాలు, మత సంస్థలకు భద్రత కరవయిందని, వాటిపై దాడులు జరగడం విచారకరమని తెలిపింది.
బంగ్లాదేశ్లో కొందరు చేస్తున్న రొచ్చగొట్టే ప్రకటనలకు స్పందించ వద్దని, ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలని రాష్ట్ర ప్రజలకు మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వంపై ప్రజాగ్రాహం వెల్లువెత్తింది. దీంతో ఆమె తన ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆమె భారత్ లో తలదాచుకున్నారు. ఇక బంగ్లాదేశ్ లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొలువు తీరింది.
పాకిస్థాన్ మారణహోమాలను అడ్డుకుని.. తన ఆవిర్భావానికి సహకరించిన భారత్ భద్రతకే బంగ్లాదేశ్ ఇప్పుడు ముప్పు తలపెడుతోంది.
షేక్ హసీనా ప్రభుత్వం గత ఆగస్టులో కుప్పకూలి మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. గత నాలుగు నెలులుగా బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఇస్కాన్ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి.
సరిహద్దుల్లో బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పశ్చిమ బెంగాల్కు సమీపంలో అత్యాధునిక బేరక్తర్ టీబీ2 డ్రోన్లను మొహరించింది.
పశ్చిమ బెంగాల్ సమీపంలో బంగ్లాదేశ్ టర్కీ నిర్మిత డ్రోన్లను మోహరించినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో నిఘాను పెంచింది. అయితే ఎందుకు డ్రోన్లను అక్కడ మోహరించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.