Home » Ballari
తుంగభద్ర జలాశయం నుంచి అధికారులు బుధవారం నీటిని విడుదల చేశారు. డ్యాం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 78.100 టీఎంసీలకు చేరాయి.
తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో(Inflow) తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా ఎగువ నుంచి వరద తాకిడి తగ్గింది. దీంతో ఇప్పుడే క్రస్ట్గేట్లు ఎత్తే ఆలోచన లేనట్లు బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని సండూరు తాలుకా యశ్వంత్నగర నుంచి గరగా నాగలాపురం గ్రామ మార్గంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు మార్గంలో వంతెనపై పులి కనిపించింది. నాగలాపురం వెళ్లే వారు రోడ్డు పక్కనే పులి కనిపించడంతో పరుగులు తీశారు.
తుంగభద్ర డ్యాం నుంచి ఎగువ, దిగువ కాలువలకు జూలై 10న నీరు విడుదల చేయాలని ఐసీసీ నిర్ణయించింది. డ్యాంలో ఉన్న నిల్వల ఆధారంగా నీటిని విడుదల చేయాలని తీర్మానం చేసింది.
తుంగభద్ర జలాశయానికి వరదనీటి చేరిక రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రోజూ 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఇది రెండురోజుల నుంచి భారీగా పెరుగుతుండటంతో గత ఏడాది కొట్టుకుపోయిన 19వ క్రస్ట్గేట్ మరమ్మతు పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
విజయనగర జిల్లా, కమలాపురం చెరువులో చేపలు మృత్యువాత కారణంగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో మంది మత్య్సకారులు జీవనం ఈ చెరువుపైనే ఆధార పడి ఉంది.
తుంగభద్ర ఆయకట్టు క్రస్ట్గేట్లకు కాలం చెల్లడంతో జలాశయానికి సంబంధించి 32 గేట్లను మార్చాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో.. ఈ ఏడాది జలాశయంలో పూర్తి స్థాయిలో కాకుండా 80 టీఎంసీల నీరు నిలపాలని అధికారులు నిర్ణయించారు.
తుంగభద్ర ఆయకట్టు రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. కాల్వల్లోకి నీరు రాకున్నా నారు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. నదీ జలాలు, బోర్లు, డ్యాం నీరు ఆధారంగా బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో 7లక్షల హెక్టార్ల ఆయకట్టు పైగా ఉంది.
బెంగళూరులో ఆర్సీబీ క్రికెట్ జట్టుకు సన్మాన కార్యక్రమంలో జరిగిన తొక్కిస లాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి శ్రీరాములు(Sri Ramulu) ధ్వజమెత్తారు.
తుంగభద్ర రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో నీరు పెద్దఎత్తున వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 21.091 టీఎంసీల నీరు నిలువ ఉంది.