• Home » Asaduddin Owaisi

Asaduddin Owaisi

AIMIM: తమిళనాట పొడిచిన కొత్త పొత్తు.. మజ్లిస్, అన్నాడీఎంకే కలిసి ఎన్నికల బరిలో

AIMIM: తమిళనాట పొడిచిన కొత్త పొత్తు.. మజ్లిస్, అన్నాడీఎంకే కలిసి ఎన్నికల బరిలో

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. అధికార బీజేపీని ఢీ కొట్టడమే ధ్యేయంగా తమిళనాడులో రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యాయి. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, జాతీయ పార్టీ ఏఐఎంఐఎం(AIMIM)లు పొత్తుకు సిద్ధమయ్యాయి.

Asaduddin Owaisi: ‘అసద్‌’ ప్రచారం ఆరంభం.. కార్యకర్తలతో కలిసి ఒవైసీ పాదయాత్ర

Asaduddin Owaisi: ‘అసద్‌’ ప్రచారం ఆరంభం.. కార్యకర్తలతో కలిసి ఒవైసీ పాదయాత్ర

రంజాన్‌ మాసం ముగియడంతో మజ్లిస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) వందలాది మంది కార్యకర్తలను వెంట తీసుకుని బహదూర్‌పురా(Bahadurpura) శాసనసభ నియోజకవర్గంలోని కామాటిపురా, ఉస్మాన్‌బాగ్‌లతో పాటు బొందలగూడ ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు.

CAA: సీఏఏపై స్టే విధించండి.. సుప్రీంను ఆశ్రయించిన అసదుద్దీన్

CAA: సీఏఏపై స్టే విధించండి.. సుప్రీంను ఆశ్రయించిన అసదుద్దీన్

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై స్టే విధించాలని కోరుతూ AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం మార్చి 11న పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని అమలు చేసి.. నాలుగు నిబంధనలను నోటిఫై చేసింది.

TS Politics: రేవంత్ మొండిఘటం.. పోరాడి అధికారం సాధించుకున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

TS Politics: రేవంత్ మొండిఘటం.. పోరాడి అధికారం సాధించుకున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి మొండి ఘటం అని, పోరాడి అధికారం సాధించుకున్నారని అసదుద్దీన్ అభిప్రాయ పడ్డారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అంటోన్న సంగతి తెలిసిందే. అసదుద్దీన్ ఒవైసీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉంటుందని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Hyderabad: రేవంత్ పట్టుదలతో సీఎం అయ్యారు.. కాంగ్రెస్ సర్కార్‌కి సహకరిస్తామన్న అసదుద్దీన్

Hyderabad: రేవంత్ పట్టుదలతో సీఎం అయ్యారు.. కాంగ్రెస్ సర్కార్‌కి సహకరిస్తామన్న అసదుద్దీన్

సీఎం రేవంత్ పట్టుదలతో ముఖ్యమంత్రి పదవిని సాధించారని ఎంపీ అసదుద్దీన్(Asaduddin Owaisi) అన్నారు. పాతబస్తీలో మెట్రో శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌(CM Revanth Reddy)తో పాటు ఎంపీ అసద్ పాల్గొన్నారు.

Telangana: ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడి మృతి.. స్వదేశానికి తీసుకురావాలని అసద్ విజ్ఞప్తి

Telangana: ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడి మృతి.. స్వదేశానికి తీసుకురావాలని అసద్ విజ్ఞప్తి

ఉద్యోగం ఇప్పిస్తామని ఓ కన్సల్టెన్సీ చెప్పిన మాటలు నమ్మి రష్యాకు వెళ్లాడు ఓ యువకుడు. తీరా ఉద్యోగం పేరుతో రష్యా సైన్యంలో అతన్ని చేర్పించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌తో రష్యా జరుపుతున్న యుద్ధంలో ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌కి చెందిన ఆ యువకుడి కుటుంబంలో విషాదం నింపింది.

TS Elections: అందరిచూపు ‘హైదరాబాద్‌’పైనే!

TS Elections: అందరిచూపు ‘హైదరాబాద్‌’పైనే!

నగరంలోని హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి ఎరుగని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీని ఢీకొట్టడానికి ధార్మికవేత్త, కళాకారిణి, వ్యాపారవేత్త డాక్టర్‌ కొంపెల్ల మాధవీలతకు బీజేపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది.

TS Politics: హైదరాబాద్ ఎంపీ స్థానంలో అసదుద్దీన్‌పై మాధవీలత పోటీ!.. ఆమె ట్రాక్ రికార్డు ఇదే...

TS Politics: హైదరాబాద్ ఎంపీ స్థానంలో అసదుద్దీన్‌పై మాధవీలత పోటీ!.. ఆమె ట్రాక్ రికార్డు ఇదే...

నగరంలో బీజేపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానంలో మజ్లి్‌సకు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతామా ఫౌండేషన్‌ల చైర్‌పర్సన్‌ మాధవీలతకు టికెట్‌ ఖరారు చేసింది. మజ్లి్‌సకు దీటుగా ఉండేందుకే మాధవీలతకు టికెట్‌ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయాలకు మాధవీలత కొత్త. ఆమెకు పార్టీలో గాడ్‌ఫాదర్‌ ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Telangana: అసదుద్దీన్‌పై మాధవీలత పోటీ.. ఎవరీమె.. బీజేపీ టికెట్ ఎలా దక్కింది..!?

Telangana: అసదుద్దీన్‌పై మాధవీలత పోటీ.. ఎవరీమె.. బీజేపీ టికెట్ ఎలా దక్కింది..!?

Telangana Parliament Elections: హైదరాబాద్ (Hyderabad) పార్లమెంట్ ఎంఐఎం అడ్డా.. 2004 నుంచి ఈ నియోజకవర్గం మజ్లిస్‌దే..!. ఒక్క మాటలో చెప్పాలంటే అసదుద్దీన్ కంచుకోట. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి నిలిచారయన. అంతకుమునుపు 1984 నుంచి 2004 వరకు సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ ఆరు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. అయితే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసద్‌కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కడంతో కమలం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. ఇదే జోష్‌లో పార్లమెంట్ స్థానాలను సైతం ఎక్కువగానే సాధించాలని వ్యూహ రచన చేస్తోంది...

MIM: దేశానికి బాబా మోదీ అవసరం లేదు.. ప్రధానిపై ఫైర్ అయిన ఓవైసీ..

MIM: దేశానికి బాబా మోదీ అవసరం లేదు.. ప్రధానిపై ఫైర్ అయిన ఓవైసీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్దిష్ట సమాజానికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రధానిపై ఫైర్ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి