Home » Asaduddin Owaisi
ఉద్యోగం ఇప్పిస్తామని ఓ కన్సల్టెన్సీ చెప్పిన మాటలు నమ్మి రష్యాకు వెళ్లాడు ఓ యువకుడు. తీరా ఉద్యోగం పేరుతో రష్యా సైన్యంలో అతన్ని చేర్పించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్తో రష్యా జరుపుతున్న యుద్ధంలో ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్కి చెందిన ఆ యువకుడి కుటుంబంలో విషాదం నింపింది.
నగరంలోని హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి ఓటమి ఎరుగని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఢీకొట్టడానికి ధార్మికవేత్త, కళాకారిణి, వ్యాపారవేత్త డాక్టర్ కొంపెల్ల మాధవీలతకు బీజేపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది.
నగరంలో బీజేపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో మజ్లి్సకు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతామా ఫౌండేషన్ల చైర్పర్సన్ మాధవీలతకు టికెట్ ఖరారు చేసింది. మజ్లి్సకు దీటుగా ఉండేందుకే మాధవీలతకు టికెట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయాలకు మాధవీలత కొత్త. ఆమెకు పార్టీలో గాడ్ఫాదర్ ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Telangana Parliament Elections: హైదరాబాద్ (Hyderabad) పార్లమెంట్ ఎంఐఎం అడ్డా.. 2004 నుంచి ఈ నియోజకవర్గం మజ్లిస్దే..!. ఒక్క మాటలో చెప్పాలంటే అసదుద్దీన్ కంచుకోట. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి నిలిచారయన. అంతకుమునుపు 1984 నుంచి 2004 వరకు సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ ఆరు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. అయితే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసద్కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కడంతో కమలం పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఇదే జోష్లో పార్లమెంట్ స్థానాలను సైతం ఎక్కువగానే సాధించాలని వ్యూహ రచన చేస్తోంది...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్దిష్ట సమాజానికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రధానిపై ఫైర్ అయ్యారు.
తమ నుంచి బాబ్రీ మసీదును లాక్కున్నానరని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ఖండించారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ( BJP Party ) తరఫున 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ ఎమ్మెల్యేలంతా రేపు (శనివారం) జరిగే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) ఉంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Raja Singh ) ప్రకటించారు.
తెలంగాణలో అధికారం పొందడం కోసం.. రాష్ట్రంలో బీజేపీ విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా రంగంలోకి దింపింది. వారిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఒకరు.
మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) బీఆర్ఎస్ ( BRS ) పార్టీని నడుపుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ( Kishan Reddy ) అన్నారు.
బాబ్రీ మసీదు ( Babri Masjid ) కూల్చివేతలో బీజేపీ, RSS పాత్ర ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీది కూడా అంతే ఉందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) తీవ్ర ఆరోపణలు చేశారు.