Home » Army
ప్రధాన మంత్రి మోదీ స్పష్టం చేశారు — ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలను వేరు చేయమని, అణ్వస్త్ర బెదిరింపులను భారత్ ఏమాత్రం భయపడదని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై విధ్వంసకర దాడులు నిర్వహించినట్లు తెలిపారు.
భారత విమానాశ్రయాలు 32 ప్రాంతాలలో సర్వీసులు తిరిగి ప్రారంభించాయి. పాకిస్థాన్తో కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ విమానాశ్రయాల్లో రాకపోకలు పునరుద్ధరించబడినట్లు ఏఏఐ ప్రకటించింది.
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందించిన మాజీ ఆర్మీ చీఫ్ నరవణె, యుద్ధం బాలీవుడ్ సినిమా కాదని, దౌత్యానికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యుద్ధం చివరి పరిష్కారంగా మాత్రమే ఉండాలని ఆయన సూచించారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత త్రివిధ దళాలు పాకిస్థాన్లోని 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. నూర్ఖాన్, రహీమ్యార్ఖాన్ వంటి ముఖ్యమైన ఎయిర్బేస్ల రన్వేలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు.
భారత్-పాక్ డీజీఎంవోలు హాట్లైన్ భేటీలో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు సైన్యాన్ని తగ్గించాలని, డ్రోన్, మిసైల్ దాడులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. అయినప్పటికీ, మోదీ ప్రసంగానంతరం పాక్ డ్రోన్లు భారత్లోకి ప్రవేశించగా, వాటిని భారత సైన్యం సమర్థంగా కూల్చివేసింది.
పాక్ ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నిర్వహించినట్టు భారత సైన్యం శుక్రవారం వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ ప్రభావం, సాధించిన విజయాలు, ఏ ఉద్దేశంతో ఆపరేషన్ ప్రారంభించామనే వివరాలను సమగ్రంగా వివరించింది.
పాకిస్థాన్ మొదటిరోజు డ్రోన్ దాడులపై విరుచుకపడటంతో దాదాపు అన్నింటిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుని కూల్చేసిందని, భారత్ జరిపిన కౌంటర్ అటాక్లో లాహోర్లోని రాడార్ ఇన్స్టలేషన్ ధ్వంసమైందని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. పాక్ భూతల దాడులను అడ్డుకునేందుకు పలు చర్యలు తీసుకున్నామన్నారు.
పాక్ ఉల్లంఘనలకు పాల్పడితే కౌంటర్ ఆటాక్ ఇచ్చేందుకు వెస్ట్రన్ బోర్డర్స్లోని ఆర్మీ కమాండర్లకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పూర్తి అధికారులు ఇచ్చారు. పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై ఆర్మీ కమాండర్లతో ద్వివేది సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
జమ్ముకశ్మీర్లో పోరాడుతూ అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ పార్థివదేహం స్వగ్రామం కళ్లితండాకు తరలించారు.మంత్రి సవిత, పవన్ కల్యాణ్, లోకేశ్ తదితరులు నేడు అధికార లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే పాకిస్థాన్ ఉల్లంఘించింది. డ్రోన్లతో దాడులు జరిపి బీఎస్ఎఫ్ ఎస్సై వీర మరణం చెందారు.