Home » AP Election 2024
| పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
|---|---|---|---|
టీడీపీ + |
0 | 0 | 0 |
వైఎస్ఆర్సీపీ
|
0 | 0 | 0 |
కాంగ్రెస్ పార్టీ
|
0 | 0 | 0 |
ఇతరులు |
0 | 0 | 0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
151 |
తెలుగుదేశం పార్టీ |
23 |
జనసేన పార్టీ |
1 |
భారతీయ జనతా పార్టీ |
0 |
భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ |
0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
తెలుగుదేశం పార్టీ |
102 |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
67 |
భారతీయ జనతా పార్టీ |
4 |
ఇతరులు |
2 |
మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. లోక్ సభ ఏడో దశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సరిగ్గా 6.30 గంటలకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో లోక్ సభ పోలింగ్ ఏడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రంతో చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి.
ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కడప జిల్లాకు చెందని పోలీస్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కడపలోని రౌడీషీటర్లను జిల్లా బహిష్కరణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లా నుంచి 21 మంది రౌడీ షీటర్లను బహిష్కరించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1038 మందిపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు.
పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తోందన్నారు. ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్పై వేసిన అప్పీల్లో వైసీపీ తోక ముడిచిందన్నారు. తాము ఓడిపోయినా.. నిసిగ్గుగా ఎలక్షన్ కమిషన్ పై వైసీపీ విషం కక్కుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జలు రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు.
కౌంటింగ్ రోజు దగ్గరపడే కొద్దీ టెన్షన పెరుగుతోంది. ఫలితాల కోసం ఎదురుచూసే అభ్యర్థులు, పార్టీలు, ఓటర్లది ఒక రకమైన టెన్షన కాగా.. కౌంటింగ్లో పాల్గొనే అధికారులది మరో రకం టెన్షన. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల అధికారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ నాయకులు హింసాత్మక మార్గాలను ఎంచుకోవడమే దీనికి కారణమని కొందరు అంటున్నారు. కౌంటింగ్ రోజున తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఒత్తిడి చేస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మొదలు...
ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా తన పైన నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణకు హైకోర్ట్ అనుమతించింది.
ఏపీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆందోళనలను ప్రేరేపించేలా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. పోలింగ్ కేంద్రాల్లో పిన్నెల్లి సోదరులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ పోలింగ్ ఏజెంట్ నోముల మాణిక్యాలరావు (Nomula Manikyala Rao) పిన్నెల్లి చేతిలో తీవ్రంగా గాయపడ్డారు.
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై (CS Jawahar Reddy) వరుసగా జనసేన నేత మూర్తి యాదవ్ ( Murthy Yadav) సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలపై సీఎస్ కార్యాలయం నోటీసులు కూడా పంపించింది. అయితే జనసేన నేత మూర్తి యాదవ్ ఏమాత్రం తగ్గకుండా సీఎస్పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎన్నికల ముందు వైనాట్ 175 నినాదాన్ని గట్టిగా వినిపించిన వైసీపీ ఫలితాల సమయం దగ్గరపడుతున్న వేళ స్వరం మార్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామంటూ పోలింగ్ ముందువరకు కాన్ఫిడెంట్గా ఉన్న వైసీపీ నేతలను ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతుందట.