Home » AP CM
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మరోసారి లండన్ పర్యటనకు (London) వెళ్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (TS High Court) వైఎస్ జగన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) పిటిషన్ దాఖలు చేశారు...
తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో (AP NIT) సీట్లు కుదించేశారు. గత ఏడాది 750 మంది విద్యార్థులకు అవకాశం లభించగా, ఈ ఏడాది 480 సీట్లకు మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. అంతకుముందు ఏడాది 600 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించారు. వాస్తవానికి దేశంలోనే ఏపీ నిట్ అత్యధిక సీట్లతో ప్రారంభమైంది.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ (Cm Jagan) నేతృత్వంలో క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం జరిగింది.
పరిపాలన చేతగాని అసమర్థుడిని ముఖ్యమంత్రిని చేస్తే నాలుగేళ్లలో ప్రజలకు నరకం చూపించారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, యువత, మహిళల రోదనవేదన ఎక్కువైందన్నారు. రైతులకన్నీళ్లు తుడిచి, యువత ఆశలకు జీవం పోసి, మహిళల వేదన తీర్చేది ఎప్పటికైనా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.
సీఎం జగన్మోహన్ రెడ్డిపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు. మరోసారి సీఎంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలపై సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో చేసే విమర్శలు చాలా హుందాగా ఉండేవన్నారు. ఆయన హుందాతనంలో 10% కూడా జగన్లో కనిపించడం లేదని తెలిపారు.
జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నగరం మొత్తాన్ని పోలీసులు ట్రాఫిక్లో బంధించారు. ఎమ్మెస్సార్, దర్గా సర్కిల్, గాంధీ సర్కిల్, గిరింపేట సర్కిల్, కట్టమంచి అన్ని ప్రాంతాల్లో ఎక్కడకక్కడ ప్రజలను కదలనివ్వకుండా పోలీసులు ఇబ్బందులకు గురిచేశారు.
తెలుగు దేశం పునాదులు గురించి మాట్లాడటం జగన్ అవివేకమని మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో వైసీపీ నేతలు పంచ భూతాలను మింగేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కుప్పంలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో టీడీపీ అధినేత మాట్లాడుతూ... ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలైందని...ఇక తరిమికొట్టడమే మిగిలిందన్నారు. భయపెట్టి ఎక్కువ కాలం రాజ్యం ఏలలేరని.. ఉత్తరకొరియా నియంత కిమ్ సోదరుడే జగన్ అని అన్నారు. పులివెందులలో భయపెట్టి గెలుస్తున్నారని.. కుప్పంలో ప్రజల అభిమానంతో గెలుస్తున్నామని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు, దళితులపై దాడులను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.