Home » AP BJP
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ప్రెస్మీట్ పెట్టినా, అసెంబ్లీలో మాట్లాడినా చాలా వినసొంపుగా ఉంటుంది.. చాలా లాజికల్గా మాట్లాడుతారని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. ప్రతిపక్ష నేతల నుంచి చిన్న విమర్శ వచ్చినా సరే వెంటనే మీడియా మీట్ (Media) పెట్టేసి కౌంటరేస్తుంటారు. అలాంటిది..
మైనింగ్ మాఫియాపై (Mining Mafia) లీగల్సెల్, ఆర్టీఏ సెల్ సంయుక్త పోరాటం చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) సూచించారు.
బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ని పార్టీ అధిష్ఠానం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది...
ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్.! ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురంధేశ్వరి (Purandeswari ).. వైసీపీపై (YSR Congress) ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ (YS Jagan) చేసిన అప్పులు, కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు తీసి మరీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు..
పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం సినిమాల్లో పవన్కు ఉన్న క్రేజ్ను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆయన్ను ఎన్డీఏ కూటమి సమావేశానికి ఆహ్వానించింది. మరోవైపు ఇన్ని రోజులు తనను పట్టించుకోకుండా ఇప్పుడు ఢిల్లీ పెద్దలు పిలవగానే వెళ్లాలా వద్దా అని ఆలోచించి చివరికి పవన్ పెద్దవాళ్లు పిలిచినప్పుడు వెళ్లడమే సంప్రదాయం అని భావించారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
అవును.. దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక సీన్ మారిపోయింది..! సోమువీర్రాజు (Somu Veerraju) అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.! మొదటి ప్రసంగంతోనే జగన్ సర్కార్ను ఏకిపారేశారు!. వైసీపీ సర్కార్ (YSRCP Govt) వైఫల్యాలను ఎత్తిచూపుతూ పురంధేశ్వరి చెడుగుడు ఆడేసుకున్నారు.!..
జనసేన ఎప్పటికీ మిత్ర పక్షమేనని కుండబద్దలుకొట్టినట్టు తేల్చిచెప్పారు. తద్వారా ఇరు పార్టీల మైత్రిపై అధ్యక్షురాలి హోదాలో స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్తో సోమువీర్రాజు మాట్లాడుతూనే ఉండేవారని, జనసేనతో సమన్వయంతో ముందుకు వెళ్తామని పురంధేశ్వరి చెప్పారు. జనసేన తమకు ఎప్పటికీ మిత్ర పక్షమేనని అన్నారు. తద్వారా జనసేన-బీజేపీ మైత్రి విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఎన్నికల్లో కూడా కలసి వెళ్లే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.
వైసీపీ అవినీతి పాలనకు అంతం పలికే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కలిశారు. అధ్యక్షురాలిగా నియమించడంపై నడ్డాకు పురంధేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకానికి నడ్డాకు కృతజ్ఞతలు తెలిపినట్లు పురంధేశ్వరి వెల్లడించారు.
పురందేశ్వరికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వటంపై రెండు రకాల చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీని దగ్గర చేసుకునే క్రమంలో ఇదో ప్రయత్నంగా అత్యధికులు భావిస్తున్నారు. కాగా కమ్మ సామాజికవర్గం.. ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో అయోమయ స్థితిని కల్పించి వైసీపీకి ఉపయోగపడేందుకే బీజేపీ పురందేశ్వరికి పదవిని ఇచ్చిందన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు.