Home » AP Assembly Budget Sessions
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు గాను మంత్రి పయ్యావుల కేశవ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. 2024 - 25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మంత్రి సభలో ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో రూపొందించిన బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల.
Andhrapradesh: రూ.2.94 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో అత్యధికంగా విద్య, నైపుణ్య రంగం , వైద్య, వ్యవసాయం, ఇరిగేషన్, పంచాయితీ రాజ్- గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి - రాష్ట్ర రహదారుల కోసం కేటాయింపులు చేశారన్నారు. అభివృద్ధికి పెద్ద పీఠ వేస్తూనే వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం దాదాపు 23% బడ్జెట్ నిధులు కేటాయింపులు చేయడమంటే, ఈ వర్గాలను స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వామ్యం చేయడమని చెప్పవచ్చన్నారు.
అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడానికి జగన్ మాట్లాడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అధికారం కోసం జగన్ రాజకీయాల్లో ఉన్నారు కానీ... రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్పారు. గతంలో క్యాబినెట్ సమావేశాలు కానీ, సచివాలయానికి వచ్చిన దాఖలాలు కానీ జగన్కు లేవని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు.
Andhra Pradesh Assembly Budget Session Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తూ దూసుకెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. సభలో పూర్తిస్థాయి బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ వార్షిక బడ్జెట్ను సభ ముందు ఉంచుతున్నానన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమన్నారు.
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ను ఏపీ అసెంబ్లీలో ఇవాళ(సోమవారం) ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. సూపర్6 పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సాయంత్రం విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభంతోపాటు రాష్ట్రంలోని చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్కు సీఎం చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది.
గ్రామ సమీపంలోని రామాలయంలోకి తాము ప్రవేశించరా దని కొంత మంది ఆంక్షలు పెడుతు న్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని పీలేరు మండలం వేపులబైలు పంచా యతీ రెడ్డివారిపల్లె సమీపంలోని దళిత వాడ గ్రామస్థులు అధికారులను కోరా రు.
గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయని ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా 4,317 ఎకరాల వరి పంట దెబ్బతిందన్నారు.