Home » Andhrapradesh
అప్రకటిత విద్యుత కోతలతో మం డల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గ్రామాల్లో తరచూ విద్యుత అంతరాయం ఏర్పడుతోంది. దోమలతో చిన్నారులు, వృద్ధులు వ్యాధి బారిన పడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత కోతలపై అధికారులను ప్రశ్నించినా, వారు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా అని ఐసీడీఎస్ సూపర్వైజర్ సత్యవతి పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాలపై బుధవారం నల్లమాడలో అవగాహన ర్యాలీ ని ర్వహించారు. వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
మండలంలో వైసీపీ భారీ షాక్ తగిలింది. మండలంలో వైసీపీలో కీలకంగా ఉన్న పలువురు నాయకులు బుధవారం టీడీపీ మండల నాయకులు హర్షవర్దన, గణేశ ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతపురంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాల యంలో తాడిమర్రికి చెందిన బండారు నరేంద్ర, పన్నూరు నాగభూషణ, హరిజన నరసింహుడు, తలారి నారాయణస్వామితో పాటు మొత్తం 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. టీఎనఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన యాంటీ డ్రగ్స్ పోస్టర్లను ఆయన బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువత రేపటి పౌరులన్నారు. వారు డ్రగ్స్ కు ఆకర్షితుల అయితే దేశ భవిష్యత్తు నాశనం అవుతోందన్నారు.
అధికారులందరూ సమన్వ యంతో పనిచేసి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆర్డీఓ మహేశ పేర్కొన్నారు. ఆయన బుధవారం ధర్మవరం మా ర్కెట్యార్డ్లో ఉన్న ఎంఎల్ఎస్ స్టాక్పాయింట్ను తనిఖీ చేశారు. గోదాములో ఉన్న నిత్యావసర సరుకులను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, ఇతర రికార్డులను పరిశీలించి సరుకుల లభ్యత, పంపిణీ వివరాలను క్రాస్ చెక్ చేశారు.
మండల వ్యాప్తంగా నాడు - నేడు పథకం పనులతో పాఠశాలల దశ మారుతుందని ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు ఆశపడ్డారు. అయితే పలు పాఠశాల భవనాలు అర్థాం తరంగా ఆగిపోవడంతో అసౌకర్యాల నడుమ విద్యార్థులు చదువులు కొన సాగిస్తున్నారు. మండలంలోని పాఠశాలల తరగతి గదుల నిర్మాణా లను నూతనంగా చేపట్టి, మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్ది ప్రైవేటు విద్యా సంస్థల కు దీటుగా ఉండేలా చేస్తామని గత వైసీపీ పాలనలో అప్పటి పాలకు ఎంతో ఆర్భాటంగా గొప్పలు పలికారు.
మండలపరిధిలోని గోళ్లవారి పల్లి సమీపంలో ఉపాధి నిధులతో పశువుల దాహార్తిని తీర్చడానికి నీటి తొట్టెలు నిర్మించారు. అయితే నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తరువాత తన కేమీ సంబంధం లేదని అలాగే వదిలేశారు. మరి ఆ తొట్టెలకు నీటి సౌకర్యం ఎవరు కల్పిస్తారో తెలియక పశువుల కాపర్లు ఇబ్బందులు పడుతున్నారు.
తమ గ్రామానికి హంద్రీ నీవా కాలువ ద్వారా సాగు, తాగునీరు వచ్చేలా చూడాలని మండలం లోని ఓబుళనాయునిపల్లి గ్రామస్థులు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్కు వినతులు అందించారు. ‘మీ సమస్య-మా బాధ్యత’ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం మండలంలోని ఓబుళనాయునిపల్లి లో నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలను ఆర్జీల రూపంలో స్వీక రించారు.
తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ పేర్కొన్నారు. స్థానిక ఏరియా ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివ రించారు. తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని, బిడ్డల వ్యాదినిరోధక శక్తిపెర గాలంటే తల్లిపాలే ముఖ్యమన్నారు.
అక్రమార్కులెవరూ తప్పించుకోలేరని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మిగనూరు పట్టణంలో 2008లో మంజూరై 2009లో అప్పటి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హయాంలో రూ. 44కోట్లతో ప్రారంభమై నేటికి అసంపూర్తిగా ఉన్న యూజీడీ(అండర్గ్రౌండ్ డ్రైనేజీ)లో జరిగిన అక్రమాలపై విచారణ కమిటీ వేస్తామన్నారు.