Home » Andhra Pradesh
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి కె.గంగవరం మండలం కోటిపల్లి వరకు సుమారు 25 కిలోమీటర్లు మేర పడవల పోటీలు జరిగాయి. పొటీలలో సుమారు 90 పడవలతో మత్స్యకారులు బృందాలుగా పాల్గొన్నారు.
రైతులను తప్పుదోవ పట్టించేలా కొంతమంది అబద్ధపు కథనాలు పత్రికలలో రాస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. టీటీడీ మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. పార్లమెంటు సమావేశాలకు వెళ్లేందుకు కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది.
రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ మరోసారి సమావేశమైంది. రైతుల ప్లాట్లకు హద్దు రాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.
సైబర్ ముఠా గుట్టును భీమవరం పోలీసులు రట్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ దొంగలు రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మను బెదిరించి.. రూ.78 లక్షలు కాజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు.
శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఎప్పుడూ కూడా వేంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పనిని చెయ్యనని.... ఎవరినీ చేయనివ్వనని స్పష్టం చేశారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. వర్షాల ప్రభావంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.