Home » Andhra Pradesh
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని మండిపడ్డారు.
రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి చంద్రబాబు అని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో కేంద్రమంత్రి మాట్లాడారు.
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టింది. ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ జగన్ నాశనం చేసిన విద్యుత్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు తన అపార అనుభవంతో గాడిలో పెడుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 22 నెలలుగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ట్రూడౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని అన్నారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టి చర్చకు అనుమతించాలని ఎంపీలు కోరారు.
తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఎన్నో వ్యవస్థాపక దినోత్సవాలు నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేయడం, సమావేశాలు నిర్వహించడం, పార్టీ గత చరిత్రపై ఉపన్యాసాలు ఇవ్వడం అనవాయితీగా మారింది. కానీ ఈ సారి అందుకు భిన్నంగా..
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పర్యటించిన హోంమంత్రి అనిత చేనేతలకు ఉచిత విద్యుత్ పథకంపై ప్రచారం చేశారు. చేనేతలకు సరికొత్త వెలుగులంటూ ఇంటింటికి వెళ్లి హోం మంత్రి కరపత్రాలను పంచారు.
చిత్తూరు జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రెండు రోజుల క్రితం చంద్రమ్మ అనే మహిళ కనిపించకుండా పోయింది. పలమనేరు రూరల్ మండలం జగమర్ల అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైంది.
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనుంది.
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కృషితోనే ఆర్డీట్జీట ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ సాధ్య మైందని దివ్యాంగుల సంఘం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్ సింహ అ న్నారు. దివ్యాంగుల సంఘం నాయకులు మంగళవారం పట్టణంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును పూలమాల లు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.