Home » Ananthapuram
బత్తలపల్లి, ఆగస్టు 5: ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణను చూసి.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైసీపీ వారికి పట్టుకుందని, అందువల్లే దాడులకు పాల్పడుతున్నారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ విమర్శించారు. పుంగనురులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడి కాన్వాయ్పైనా, టీడీపీ కార్యకర్తలపైన వైసీపీ అల్లరి మూకలు రాళ్ల దాడి చేయడా న్ని ఖండిస్తూ.. మండలకేంద్రంలో శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు.
రాబోవు ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని మహాశక్తి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్దామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పార్టీ శ్రేణులకు పిలుపినిచ్చారు.
సాకే భారతి.. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు పొందిందామె. కూలి పనులు చేసుకుంటూ.. చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగిస్తూ కెమిస్ర్టీలో పీహెచ్డీ పట్టా సాధించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పట్టా పొందిన తర్వాత ‘ అక్షర భారతి’ సమాజానికి పరిచయమైంది. ఆమె ధీనగాథ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాక.. అందరి చేత ప్రశంసలు అందుకుంది.
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు.
వైసీపీ పాలనలో రాష్ర్టాభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. మండలకేంద్రంలో ఆదివారం స్థానిక తెలుగుయువత నాయకులు మిషన రాయలసీమపై ప్రచారం నిర్వహించారు.
అనంతపురం జిల్లా: కంబదూరులో మద్యం మత్తులో అల్లరి చేష్టలకు దిగిన నలుగురిపై చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా, కంబదూరు మండల కేంద్రంలోని పీర్ల గుడి వద్ద నిన్న రాత్రి మద్యం మత్తులో...
అనంతపురం జిల్లా: కంబదూరు మండల కేంద్రంలో మొహరం పండుగ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పాత కక్షలు నేపథ్యంలో పీర్ల గుడి వద్ద గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ కర్రలతో, కొడవలితో దాడులు చేసుకున్నారు.
తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి నిరసన కొనసాగిస్తున్నారు.
అనంతపురం జిల్లా పామిడి సమీపంలోని పెన్నా నదిలో ఓ వింత చేతి బోరు అందరికీ దర్శనమిస్తోంది. ఈ చేతి బోరు నుంచి నీళ్లు కావాలంటే వెంట నిచ్చెన తీసుకురావాల్సిందే. దీంతో ఈ బోరు అందరికీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అసలు పెన్నా నదిలో ఈ చేతి బోరు ఎందుకు ఉందని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవమైన వాసవీమాత శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పరిధిలోని డీబీ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆష్టలక్ష్మీ ఆలయ ప్రాంగణంలో వెల సిన వాసవాంబను శుక్రవారం శాకాంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.