Home » Anantapur urban
హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటైన శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆదివారం జిల్లాలోని రామమందిరాలన్నీ భక్తజనకోటితో కిటకిటలాడనున్నాయి. ఇప్పటికే రామాల యాలు విద్యుద్దీపాలంకరణతో ముస్తాబయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ఆలయాలవద్ద అవసరం మేరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
వేసవిలో ప్రయాణీకుల రద్దీని నియంత్రించడానికి బెంగళూరు-కలబురగి మధ్య ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
‘ఇల్లు కాదు..ఊళ్లను నిర్మి స్తున్నాం.’ ఇది గత ప్రభుత్వ హయంలోని ప్రజాప్రతినిధులు చెప్పిన మాట లు. ఆ మాటలు నేడు నీటి మూటలు గా మారాయి. ఇందుకు కొడిమి గ్రామ సమీపంలోని లేఅవుట్ నిదర్శనంగా నిలుస్తోంది. ఇళ్లు వెలుస్తాయను కున్న చోట. ముళ్ల కంపలు పెరిగాయి. కొని చోట్ల మొండిగోడలు కనిపి స్తున్నాయి.
మండలంలోని మేడాపురం గ్రామంలో శనివారం ప్రారంభమైన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతు న్నాయి. ప్రతి ఏటా ఉగాది పండు గను పురస్కరించుకుని ఇక్కడ నా లుగురోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.
తెలుగువారి నూతన సంవత్సరాదిని జిల్లా వాసులు ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని భక్త్దిప్రపత్తులతో ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో విశేష పూజాకార్యక్రమాలు, పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించారు.
నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలను ఎప్పటికప్పుడు చేపట్టాలని కలెక్టర్ వినోద్కుమార్ పే ర్కొన్నా రు. మండలంలోని ఆలమూరులో శనివారం వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ డబ్ల్యూఎస్ శాఖల పరిధిలో చేపడుతున్న నీటి నాణ్యత పరీక్షలను ఆయన తనిఖీ చేశారు. వేసవి నేపథ్యంలో నీటినాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారా యణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఏపీ సూపర్ కప్ - 2025 ఫుట్బాల్ పోటీల విజేతగా గోదావరి క్లబ్ జట్టు నిలిచింది. నగరంలోని ఆర్డీటీ స్టేడియంలో గురువారం ఫైనల్స్ నిర్వహించారు. లీగ్ పోటీల్లో ముందంజలో ఉన్న కొల్లేరు 18 పాయింట్లు, గోదావరి 15 పాయింట్లు సాధించి ఫైనల్స్లో తలపడ్డాయి. ఎక్కడా ఓటమి లేకుండా ఫైనల్స్కు చేరిన కొల్లేరు జట్టుపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా పుంజుకున్న గోదావరి జట్టులో దిలీప్, అక్షయ్ చెరో గోల్ చేశారు.
జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఎట్టకేలకు వాహనాల పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూశారు. నిత్యం వందల మంది రోగులు చికిత్స కోసం వివిధ రకాల వాహనాల్లో ఆస్పత్రికి వస్తున్నారు. మరోవైపు డాక్టర్లు, సిబ్బంది వందల మంది పనిచేస్తున్నారు. డాక్టర్లు అధికంగా సొంతకార్లలో విధులకు వస్తారు. అయితే వాహనాల పార్కింగ్కు సరైన స్థలం లేకపోవడంతో ఆస్పత్రిలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలిపి వెళుతున్నారు.
మండల పరిధి లోని పులసల నూ తల గ్రామంలో పంచాయతీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన బోరు, పైపు లైను, స్టార్టర్లను మంగళవారం రా త్రి గుర్తుతెలి యని వ్యక్తులు ధ్వంసం చేశారు. కొద్దిరోజుల క్రితం గ్రామంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది.