Home » Anantapur urban
పుట్టపర్తి, బెంగళూరు మధ్య నడుస్తున్న మెము రైలును అనంతపురం వరకూ పొడిగిస్తూ రైల్వే బోర్డు ఈనెల 15వ తేదీన ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గురువారం ప్రకటనలో తెలిపారు.
పాఠశాలలు వదిలిన సమయంలో విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్తున్న బస్సు డ్రైవర్ల తీరుపై గురువారం మండల కేంద్రంలో వారి తల్లిదండ్రులు, స్థానికులు ధర్నాకు దిగారు. మధ్యాహ్నం పాఠశాలలు వదిలిన సమయంలో యాడికి నుంచి తాడిపత్రి, నిట్టూరు వైపు వెళ్లే విద్యార్థులు బస్సుల కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్నారు.
ప్రజా అవసరాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకుని..వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. స్థానిక లెక్చరర్స్ కాలనీలో రూ. 19లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణానికి ఆయన గురువారం భూమి పూజ చేశారు. అక్కడి నుంచి రుద్రంపేటలో నూత నంగా ఏర్పాటు చేసిన 20ట్రాన్సఫార్మర్లను ప్రారంభించారు.
ఆనాటి సమాజాన్ని పట్టి పీడించిన మూఢనమ్మకాల నిర్మూలనకు కృషిచేసిన తొలి సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి అన్నారు.
మరో 25 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంటుందని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. స్థానిక అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
శింగనమల నియోజకవర్గ రైతుల పట్ల సీఎం చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ అని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అధైర్యపడకండి అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరిటాల సునీత భరోసా ఇచ్చా రు. మండలంలోని పూలకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నారాయణస్వామి కుమారై రేణుక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఖేలో ఇండియా జాతీయస్థాయి హాకీపోటీల్లో జి ల్లా క్రీడాకారిణులు ప్రతిభచాటారు. జిల్లా బాలికల జట్టులో శివగంగ, దివ్య, ఇందు, సమీరా, సుమియా, జ్యోతి, అర్చన, సాయిభవ్య, మైథిలి, నవ్య, శృతి, శాలిని, కీర్తన, అక్షయ, వింద్యశ్రీ, సనతాజ్, హర్షిత, మధురిమబాయి, జ్ఞానేశ్వరి ఉన్నారు. కళ్యాణదుర్గం నుంచి జట్టులో సుమియా, శృతి, అర్చన, సమీరా, సనాతాజ్, అక్షయ, అఖిల ఏడుగురు ఉండడం విశేషం.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని నెహ్రూ యువకేంద్రం అధికారులు పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో యువతకు క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.
నేత్రదానంపై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన అవసరమని రెడ్క్రాస్ చైర్పర్సన భారతి పేర్కొన్నారు. స్థానిక సుభాష్రోడ్డులోని శ్రీకృష్ణదేవరాయభవనలో ఆదివా రం ఇండియన రెడ్క్రాస్ సొసైటీ ఆఽధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు.