Home » Anam Ramanarayana Reddy
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారారు. దేవదాయ శాఖలోని ఉద్యోగిణితో సంబంధం ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు.
శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం సాయంకాలం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామస్తోత్రమ్’ మంగళగ్రంధాన్ని ఆవిష్కరించి.. స్వయంభూ క్షేత్రాలలో వేలకొలది అద్భుత గ్రంధాలను భక్తకోటికి ఒక యజ్ఞంలా వితరణ చేస్తున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్యను అభినందించారు. అలాగే వివిధ శాస్త్రాల ప్రమాణంతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న ధార్మిక చైతన్య కృషి వెనుక దైవబలం ఉందని, దైవబలం లేకుంటే ఇన్ని అపూర్వాలు సమాజానికి అందవని, పురాణపండ యజ్ఞకార్యాన్ని ఆయన ప్రశంసించారు.
ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మరొక అపురూప గ్రంధం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ అనబడే సుమారు మూడు వందలపేజీల గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఆనం జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఈ గ్రంధాన్ని ఆవిష్కరించి తొలిప్రతిని దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ మరియు కార్య నిర్వహణాధికారి కె.ఎస్. రామారావుకు అందజేశారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) తెలిపారు.
చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పని చేయడం ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్ది తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 65 లక్షల పేద కుటుంబాలకు మంచి, మేలు, సంక్షేమం జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. రొట్టెల పండుగ సమయంలో అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రుగులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా..
మనస్సును ఎంత నిర్మలంగా ఉంచుకుంటే అంతగా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలను పవిత్రంగా చెయ్యగలుగుతామని, అలా మనస్సును పవిత్రస్థితి వైపు నడిపించే పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనాలు రెండింటిని ఆవిష్కరించే భాగ్యం కలిగించిన పరమాత్మకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
సర్వసమర్ధులైన ప్రజాపాలకుడు చంద్రబాబు పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందని పలువురు రాజకీయకులతో ప్రస్తావిస్తున్న సీనియర్ తెలుగుదేశం నాయకులు, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య.. తనకి ఎంతో ఆత్మీయులైన ఆనం రామ నారాయణరెడ్డి విశేష రాజకీయానుభవం వున్న సంస్కారి అని, ఆనం పవిత్ర సేవలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరమని చెబుతూనే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తో చర్చలు జరిపి నెల్లూరు జిల్లాలోని మహా నృసింహ క్షేత్రమైన పెంచలకోన శ్రీ నరసింహ స్వామివారి దేవస్థానానికి సమర్పించేలా ఆనం రామనారాయణ రెడ్డి దంపతుల చిత్రాలొకవైపు ప్రచురిస్తూ.. పరమాద్భుతమైన నృసింహ ఉపాసనలతో ‘జయ జయ శత్రుభయంకర’ అనే గ్రంధాన్ని పరమ పవిత్రంగా ప్రచురించారు.
: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు.