Home » Anakapalli
Andhrapradesh: ‘‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పరుగులు పెట్టిస్తాను. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి పారిశ్రామికవేత్త మిట్టల్ ముందుకు వచ్చారు. డ్వాక్రా సంఘాలు మా మానస పుత్రిక .. దీపం 2 కింద ఆడబిడ్డలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. నిన్న నేను టీ చేశాను.వంట చేయడం చాలా ఈజీ’’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి తుని మీదుగా కేరళ రాష్ట్రానికి గంజాయి సరఫరా చేస్తున్నారన్న పక్కా సమచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి వి.మాడుగుల, కొత్తకోట సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Andhrapradesh: వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ మాఫియా జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నాణ్యతలేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారన్నారు. మద్యం తయారీ కంపెనీ నుంచి అమ్మకాలు వరకు అవినీతి చేసి అడ్డంగా దోచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన లిక్కర్ మాఫియాపై సీఐడీతో విచారణ జరిపిస్తున్నామన్నారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఒడిశాకు తాబేళ్లను అక్రమరవాణా చేస్తున్న ఇద్దరిని అటవీ శాఖాధికారులు అదుపులోకి తీసుకుని 500 తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
పెన్సిల్ ముల్లుపై వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్ది తన విద్వత్తును చాటుకున్నాడు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన నైదండ గోపాల్.
పట్టణంలోని ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు(Speaker Ayyannapatrudu) పాల్గొన్నారు. పర్యావరణానికి చెట్లు ఎంతో మేలు చేస్తాయని, వాటిని సంరక్షిస్తేనే జీవజాతి మనుగడ సాధ్యమని ఆయన చెప్పారు.
Andhrapradesh: అనకాపల్లి జిల్లా జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జిన్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారికి పరిహారం ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు కార్మికులకు ఒక్కో కార్మికుడికి రూ.1 కోటి చొప్పున ప్రభుత్వం ద్వారా పరిహారం అందజేశారు. ఈనె 23వ తేదీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురిలో...
మహారాష్ట్రలోని జాల్నా నగరంలోని ఎంఐడీసీ ప్రాంతంలో గజ కేసరి స్టీల్ ఫ్యాక్టరీ మిల్లో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో 22 మంది కార్మికులు గాయపడ్డారని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఏపీలోని అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది.