Home » AIADMK
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్రమంత్రి అమిత్షా చెప్పలేదని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మరోమారు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే తరుఫున చేపట్టిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార పయనంలో భాగంగా బుధవారం కడలూరు జిల్లా చిదంబరంలో ఈపీఎస్ రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
బీజేపీ తదితర పార్టీల కలయికతో ఏర్పడిన పొత్తు పటిష్టమని, సొంత బలంతోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని మాజీముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) మరోమారు ధీమా వ్యక్తంచేశారు.
ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 27న రాష్ట్రానికి విచ్చేయనున్నారు. గంగైకొండ చోళపురంలో జరిగే వేడుకల్లో ఆయన ముఖ్య అథిగా పాల్గొననున్నారు. ఐదు రోజులపాటు విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఆయన ఢిల్లీకి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రజాదరణతో రాజకీయాల్లో ముందుకు దూసుకెళ్తున్న అన్నాడీఎంకేను లేకుండా చేయడం ఎవరి తరము కాదని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి సవాలు విసిరారు. ‘మక్కలై కాప్పోం...తమిళగత్తై మీడ్పోం’ అనే పేరిట రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తొలివిడత ప్రచారంలో శుక్రవారం విల్లుపురం జిల్లాలో ఈపీఎస్ పర్యటించారు.
రాష్ట్రంలో రౌడీయిజం, దౌర్జన్యం, హత్యలు, దోపిడీలు, మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా జగుతోందని, ‘కమీషన్, కరప్షన్ నిర్విఘ్నంగా సాగుతోందని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ పాలనా తీరుకు వ్యతిరేకంగా తాను ప్రారంభించిన ఎన్నికల ప్రచారానికి ప్రజాదరణ అపారమని, అధికారంలోకి రాబోయేది తామేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్ మాళిగై’లో ప్రేతాత్మ సంచరిస్తున్నట్లు వదంతులు షికార్లు చేస్తున్నాయి. వాటిని నిజమని నమ్మే విధంగా ఐదురోజులుగా ఆ కార్యాలయం వద్ద సాయంత్ర వేళ్లలో ఓ మాంత్రికుడు సంచరిస్తూ శంఖాన్ని ఊదుతూ కనిపిస్తున్నాడు
డీఎంకే ప్రభుత్వాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్నాడీఎంకే.. విజయ్ విషయంలో ఒక మెట్టు దిగిందా?.. ‘కలిసివుంటేనే కలదు సుఖం’ అన్న నానుడి చందాన ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండేందుకు టీవీకేతో పొత్తుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టిందా?.. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే విజయ్(Vijay)కు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిందా?.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
మదురై మురుగన్ భక్తుల మహానాడులో పెరియార్, అన్నాదురై ద్రావిడ సిద్ధాంతాలను విమర్శిస్తూ రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తుంటే అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రులు ఆర్బీ ఉదయకుమార్, సెల్లూరు రాజు, కడంబూరు రాజు, రాజేంద్రబాలాజీ ఆసక్తిగా చూస్తూ పార్టీ పరువును దిగజార్చుకున్నారని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్ఎస్ భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా జూలై 8న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న పార్టీలతో ఎన్టీయే మెగా కూటమిని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో అమిత్షా కొద్ది నెలల క్రితం నగరానికి వచ్చి అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్నారు.