Home » AIADMK
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)కి ఎందుకనో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ పార్టీ ఆరిపోయే దీపమని, కనుకనే ఈ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పెద్ద వెలుగు ప్రసరిస్తున్నట్లు ప్రజలకు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
తమిళనాట జరగనున్న తొలివిడత లోక్సభ ఎన్నికల్లో పాలక పక్షం డీఎంకేతో పోటీపడేలా బీజేపీ వ్యూహ రచనలు చేసింది. డీఎంకే కూటమిలో పాతమిత్రపక్షాలే కొనసాగాయి. సినీనటుడు కమల్హాసన్ నాయకత్వంలోని మక్కల్ నీదిమయ్యం పార్టీ ఆ కూటమిలో చేరినా దానికి సీట్లివ్వలేదు. ఆ పార్టీకి వచ్చే ఏడాది
మదురై లోక్సభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా డాక్టర్ శరవణన్ పోటీ చేస్తున్నారు. ఆయన పరిచయ కార్యక్రమం బుధవారం సెల్లూరు ప్రాంతంలో జరిగింది.
తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఐదురోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.
తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అన్నాడీఎంకే బుధవారంనాడు ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిసామి ఈ జాబితాను పార్టీ నేతల సమక్షంలో విడుదల చేశారు.
అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ.పన్నీర్సెల్వంకు మద్రాసు హైకోర్టులో సోమవారంనాడు చుక్కెదురైంది. అన్నాడీఎంకే అధికారిక లెటర్హెడ్, రెండాకుల గుర్తు, పార్టీ జెండాను ఆయన వినియోగించుకోరాదని కోర్టు తీర్పునిచ్చింది.
వచ్చే యేడాది రాష్ట్రంలో ఖాళీ పడనున్న రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక సీటు కేటాయించాలని డీఎండీకే నాయకురాలు ప్రేమలత పట్టుబడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాట్ల ప్రతిష్టంభన కొనసాగుతోంది.
వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ప్రధాని మోదీ(PM Modi) బుధవారం తమిళనాడు(Tamilnadu)లో పర్యటిస్తున్నారు. ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమమే అయినా.. దానికి రాజకీయ ప్రాధాన్యతలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తమిళ మానిలా కాంగ్రెస్ పార్టీ అధినేత జీకే.వాసన్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు వెల్లడించారు.