Home » AIADMK
ఆ మాజీ ముఖ్యమంత్రిని తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. దీనిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరంలేదని ఆయన మరోమారు పేర్కొన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్షాను పళనిస్వామి, ఆ పార్టీ సీనియర్ నేతలు న్యూఢిల్లీలో మంగళవారంనాడు కలుసుకున్నారు. దీంతో పొత్తు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తమ సమావేశం వివరాలపై ఆయన క్లుప్తంగా మాట్లాడుతూ, ప్రజలకు సంబంధించిన అంశాలపైనే తాము మాట్లాడామని చెప్పారు.
తమిళనాడులో వరుసగా రెండోసారి అధికారంలో ఉన్న డీఎంకే 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తమిళనాడులో పార్టీ బలం పెంచుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉన్నప్పటికీ డీఎంకేకు దీటైన పార్టీగా అన్నాడీఎంకే రెండవ బలమైన పార్టీగా ఉంది.
తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమాచార సాధానాలకు చేతినిండా పని కల్పిస్తున్నారు. అలాగే మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల సమరం కూడా జరగనుండడంతో అన్ని పార్టీలు సిద్దమతున్నాయి. దీంతో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండాకుల గుర్తుపైనే పోటీ చేయనున్నట్లు తెలిపారు.
దేశంలో తాజా జనాభా లెక్కల ప్రకారం ఎంపీల సంఖ్య పెంచి, వారిని అలంకార బొమ్మలుగా కూర్చొబెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ప్రశ్నించారు.
సినీ, రాజకీయ రంగాల్లో చక్రం తిప్పిన ఎంజీఆర్లా ఎదిగి, వచ్చే ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పగటికలలు కంటున్నాడని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీమంత్రి డి.జయకుమార్(Former Minister D. Jayakumar) విమర్శించారు,
రజనీకాంత్... తమిళనాట సంచలనాలకు మారుపేరు. అయితే.. మరో ఏడాదిన్నర కాలంలో జనగబోయే ఎన్నికల్లో ఆయన ఎవరికి మద్దతు ప్రకటిస్తారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన మద్దతు కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత, ఎన్నడూ లేని విధంగా అన్నాడీఎంకే వరుస ఓటములు చవిచూడటానికి ఆ పార్టీలో కొనసాగుతున్న ఏక నాయకత్వమే కారణమని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం(Former Chief Minister O. Panneerselvam) అన్నారు.
పార్టీ పట్ల అచంచల విశ్వాసమున్న నేతలు, కార్యకర్తలంతా తన వెంటే వున్నారని అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం(Former Chief Minister O. Panneerselvam) (ఓపీఎస్) వ్యాఖ్యానించారు.