Home » Ahmedabad
అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూపు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. గాయపడినవారికి ఉచిత వైద్య సహాయం అందిస్తామని తెలిపింది.
ఇది మరో హృదయ విదారక ఘటన. ఈ విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన మొత్తం కుటుంబం మరణించింది. డాక్టర్ కోమి వ్యాస్ అనే ఆమె, రాజస్థాన్కు చెందిన ఒక పేరుమోసిన డాక్టర్. ఆమె తన భర్త, ముగ్గురు పిల్లలతో లండన్కు మకాం మార్చడానికి..
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది.
అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అయిన దగ్గర్నుంచి కూలిపోయేంత వరకు ఏ జరిగిందో కళ్లకు కట్టినట్టు చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న అందరూ ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చాయి. అయితే ఒక్క వ్యక్తి అంత పెద్ద దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
లండన్లో చదువుకుంటున్న తన కూతురిని చూసేందుకు విజయ్ రూపాని ఎయిరిండియా విమానంలో పయనమయ్యారు. విమానంలో ఆయన కూర్చున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. వేరే ప్రయాణికురాలు విమానంలో తన సీటులో కూర్చున్న విజయ్ రూపానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అసలు ఎందుకు లండన్ వెళ్లాలనుకున్నారు అనేది అందరి మదిలోని ప్రశ్న. రూపానీ తన భార్య అంజలిబెన్ రూపానీని తిరిగి తీసుకురావడానికి బయల్దేరారు.
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయ సమీపంలో ఉన్న డాక్టర్ల హాస్టల్లోకి దూసుకెళ్లి కూలిపోయింది. వెంటనే ఆ ప్రాంతంలోఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ లో ఉన్న 20మంది డాక్టర్లు చనిపోయినట్టు సమాచారం.
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్కు బయల్దేరారు.
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.