Home » Ahmedabad
అహ్మదాబాద్లో బోయింగ్ 787 విమానం కూలిన ఘటనపై నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాగే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదని అంటున్నారు.
విమానంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పైలట్.. సంబంధిత ‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్’ (ఏటీసీ)కి మేడే కాల్ చేస్తారు. అవతలి వారికి స్పష్టంగా వినిపించటం కోసం ‘మేడే, మేడే, మేడే’ అంటూ మూడుసార్లు చెబుతారు.
వారంతా కాబోయే వైద్యులు.. ప్రమాదంలో ఉన్నవారికి ప్రాణం పోసి కాపాడేవారు.. సరదాగా మాట్లాడుకుంటూ మధ్యాహ్న భోజనం చేస్తున్నారు.. ఉన్నట్టుండి ఆ భవనంపై విమానం కుప్పకూలడంతో వారు కన్న కలలు చెదిరిపోయాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, పలువురు సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూపు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. గాయపడినవారికి ఉచిత వైద్య సహాయం అందిస్తామని తెలిపింది.
ఇది మరో హృదయ విదారక ఘటన. ఈ విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన మొత్తం కుటుంబం మరణించింది. డాక్టర్ కోమి వ్యాస్ అనే ఆమె, రాజస్థాన్కు చెందిన ఒక పేరుమోసిన డాక్టర్. ఆమె తన భర్త, ముగ్గురు పిల్లలతో లండన్కు మకాం మార్చడానికి..
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది.
అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అయిన దగ్గర్నుంచి కూలిపోయేంత వరకు ఏ జరిగిందో కళ్లకు కట్టినట్టు చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న అందరూ ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చాయి. అయితే ఒక్క వ్యక్తి అంత పెద్ద దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
లండన్లో చదువుకుంటున్న తన కూతురిని చూసేందుకు విజయ్ రూపాని ఎయిరిండియా విమానంలో పయనమయ్యారు. విమానంలో ఆయన కూర్చున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. వేరే ప్రయాణికురాలు విమానంలో తన సీటులో కూర్చున్న విజయ్ రూపానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.