Home » Agriculture
పండుగల సమయంలో ఆఫర్లు.. కొవిడ్ సమయంలో వ్యాక్సిన్లు, బ్యాంకు లోన్లు, ఉద్యోగావకాశాలు.. ఇతర సమయాల్లో ట్రాఫిక్ చలాన్లు..!
రుణమాఫీ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ సవాలుగా మారింది. రెండు లక్షల రుణమాఫీ చేయటానికి మొత్తం రూ.31 వేల కోట్ల నిధులు అవసరమవుతుండగా తొలివిడతలో లక్ష వరకు మాఫీ చేయటానికి రూ. 6,100 కోట్లు ఖర్చు చేశారు.
పంట రుణాల మాఫీపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. తొలి విడతలో లక్ష దాకా రుణం మాఫీ అయిన అన్నదాతలు రైతు వేదికల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో వ్యవసాయ భూములుగా నమోదై.. సాగు చేయకుండా ఉన్న భూములపై ప్రభుత్వం సమగ్ర సర్వే చేయిస్తోంది. తొలుత ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం చేపట్టింది. కామారెడ్డి, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవోలు), పంచాయతీ కార్యదర్శులు,
దేశంలో సాగును మరింత సుదృఢం చేసేందుకుగాను 100 కొత్త రకాల విత్తనాలను, సాగు పరంగా మరో వంద సాంకేతిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు భారత వ్యవసాయ పరిశోధక సంస్థ (ఐసీఏఆర్) సంకల్పించింది.
అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. గతంలో చెప్పినట్లుగానే నిర్ణీత వ్యవధిలో తీసుకున్న అప్పు, వడ్డీ మొత్తం కలిపి కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
తమ ప్రభుత్వంలో ప్రజల అభిప్రాయాలే జీవోలుగా వెలువడుతాయని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రజల అభిప్రాయాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
పంటల సాగు కోసం చేసిన అప్పులు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. రెండేళ్ల క్రితం తండ్రి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా, కుమారుడు అదే సమస్యతో ఆయువు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకలో జరిగింది.
ఈనెల 23నుంచి "పోలం పిలుస్తోంది"(Polam Pilustondi) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. ఇకపై సాగు విషయంలో రైతులకు శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా ఎరువుల వాడేలా రైతులకు అవగాహన కల్పిస్తామని అచ్చెన్న చెప్పుకొచ్చారు.
ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తెలిపారు. 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేస్తామని అన్నారు.