Home » ABN Andhrajyothy Effect
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభమైంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించింది.
స్టూడెంట్స్, పర్యాటలకు బ్రిటన్ (Britain) బిగ్ షాక్ ఇచ్చింది. విద్యార్థి, విజిటర్ వీసాల ఫీజును బ్రిటన్ భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇంతకుముందు యూకే హోం ఆఫీస్ ప్రకటించినట్లు నేటి (బుధవారం) నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.
రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూన్లో ఉదయ్పూర్కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.
రాజస్థాన్లో అధికార పార్టీ కాంగ్రెస్లోని అంతర్గత పోరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను పదవి నుంచి దింపడానికి సగం మంది కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
జార్ఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జన జీవనం స్తంభించిపోయింది.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్పై అమెరికా వైట్హౌస్ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆధునిక భారత్-అమెరికా దౌత్య బంధానికి జైశంకర్ ‘‘ఆర్కిటెక్ట్’’ (రూపశిల్పి) అంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొనియాడారు.
త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది పనుల్లో వేగం పెంచారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే, మరోవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
ప్రముఖ క్రికెట్ కోచ్, హైదరాబాద్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ బేగ్ సార్ ఇక లేరు. 84 ఏళ్ల బేగ్ సార్ ఛాతీ నొప్పితో గత రాత్రి తుది శ్వాస విడిచారు.
నేడు జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. గాంధీకి నివాళులర్పించేందుకు ఉదయం 7.30 గంటలకు ప్రధాని రాజ్ఘాట్కు చేరుకున్నారు.
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 10వ గోల్డ్ మెడల్ చేరింది. పురుషుల టీమ్ స్క్వాష్ విభాగం ఫైనల్లో పాకిస్థాన్పై భారత్ విజయం సాధించింది.