Home » AAP
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను హత్య చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ సీఎం ఆతిషీ సంచలన ఆరోపణలు చేశారు.
విపక్ష పార్టీలను చీల్చేందుకు బీజేపీ దగ్గర ఒక మెకానిజం ఉందని, తమ మాటలను నిరాకరించిన వాళ్లను జైళ్లకు పంపుతుందని సిసోడియా అన్నారు. అధికారం కోసం బెదిరింపులు, రాజకీయ అవకతవకలకు పాల్పడటం బీజేపీ చేస్తు్ంటుందని దుయ్యబట్టారు.
ఢిల్లీ ఎన్నికల వేళ అధికార ఆప్, బీజేపీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేయడంతో ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అరవింద్ కేజ్రీవాల్పై 14 కాగ్ నివేదికలు తీవ్ర ఆరోపణలు చేశాయనీ, ఇందులో రూ.382 కోట్ల హెల్త్ రిలేటెడ్ స్కామ్ జరిగినట్టు పేర్కొన్న నివేదక కూడా ఉందని అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
తమ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పథకాలను విస్తృతపరచడంతో పాటు మధ్యతరగతి ప్రజానీకంపై మరింత దృష్టి పెడతామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
ఢిల్లీలో ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ పార్టీ పట్టుదలతో ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు రెండో మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు ప్రకటించింది..
2013లో ఆప్కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం, 2024లో జతకట్టడం వల్ల కాంగ్రెస్కు నష్టం జరిగిందని అజయ్ మాకెన్ చెప్పారు. ఢిల్లీ ప్రజలు సమస్యలు ఎదుర్కోవడం వల్ల బీజేపీకి లబ్ధి చేకూరుతుందనేది తన నిశ్చితాభిప్రాయమని అన్నారు.
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకర్గంలో శనివారంనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాము ఇచ్చిన మూడు హామీలను నెరవేర్చలేకపోయినట్టు కేజ్రీవాల్ చెప్పారు.
బీజేపీ 'గూండాలే' ఈ దాడికి పాల్పడినట్టు ఆప్ ఒక ట్వీట్లో ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఆ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది.
ఎన్నికల నిబంధన ప్రకారం పార్టీలు ఇలాంటి (డాక్యుమెంటరీ ప్రదర్శన) ఈవెంట్లు నిర్వహించాలనుకుంటే జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) కార్యాలయంలోని సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని, సందర్భాన్ని బట్టి పోలీసులు అనుమతి ఇవ్వడం కానీ నిరాకరించడం కానీ జరుగుతుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.